వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింగిల్‌గా వచ్చిన సింహానికే ప్రజలు పట్టం కట్టారు.. డా.లక్ష్మణ్

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా జరిగిన ఎగ్జిట్‌పోల్స్ వెలువడిన నేపథ్యంలోనే కేంద్రం అధికార బీజేపీ తిరిగి అధికారం చేపడుతుందనే ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర్ర బీజేపీలో జోష్ పెరిగింది.కేంద్రంతోపాటు తెలంగాణ కూడ బీజేపీకి రెండు స్థానాలు వస్తాయని పలు సర్వేలు అంచనాలు వేశాయి. దీంతో ఆపార్టీనాయకులు పూర్తి జోష్‌లో ఉన్నారు.

ఈనేపథ్యంలోనే తెలంగాణ బీజేపీ రాష్ట్ర్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశిస్తూ ,సింహం సింగిల్‌గానే వచ్చి ఎన్నికల్లో గెలుపును స్వీప్ చేస్తుందని అన్నారు. ఈనేపథ్యంలో దేశంలో తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని అన్నారు. మోడీ చారిత్రక నిర్ణయాలు తీసుకున్నారని, అయిదు సంవత్సరాలల్లో అవినీతి లేని పరిపాలను అందించడంతోపాటు అంతర్గత భద్రత విషయంలో మోడీ కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు.ఈనేపథ్యంలోనే బాలకోట్ స్ట్ర్రైక్ అని ఆయన చెప్పారు. ఈనేపథ్యంలోనే ప్రజలు సింగిల్‌గా వచ్చిన సింహానికే ప్రజలు పట్టం కట్టారని, గుంపులుగా వచ్చిన వారని బొందపెట్టారని చెప్పారు.

pm narendra modi is a lion : dr laxman

కాగా గడిచిన పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ బీజేపీకి సిట్టింగ్ స్థానంకాగా ఆ స్థానంలో ఉన్న కేంద్రమాజీ మంత్రి దత్తత్రేయను కాదని మాజి ఎమ్మెల్యే కిషన్‌రెడ్డికి కేటాయించిన విషయం తెలిసిందే,ఇక ఈస్థానంతోపాటు మహబుబ్‌నగర్, కరీంనగర్ స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్న దీమాతో ఆపార్టీ నేతలు ఉన్నారు. దీనికి తోడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడ వెలువడడంతో పార్టీనేతలు జోష్‌లో ఉన్నారు.

English summary
pm narendra modi led bjp wins once again said dr.laxman bjp president of telanagan state, and he describes pm narendra modi as a lion
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X