తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అస్వస్థత,చికిత్స
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి బుధవారం నాడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను న్యూఢిల్లోని రామ్మనోహర్లోహియా ఆసుపత్రి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు.
టిఆర్ఎస్ ఎంపీలు సంతోష్కుమార్, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాష్లు బుధవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకుగాను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి న్యూఢిల్లీకి వెళ్ళారు.
ఎంపీల ప్రమాణస్వీకారం పూర్తైన తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హుటాహుటిన రామ్ మనోహర్లోహియా ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి బీపీ ఒక్కసారిగా తగ్గిపోవడం వల్లే అనారోగ్యానికి గురయ్యాడని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని పలువురు మంత్రులు, టిఆర్ఎస్ నేతలు, ఎంపీలు పరామర్శించారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి కూడ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డిని పరామర్శించారు. ప్రస్తుతం పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.