జనావాసాల మధ్యే వ్యభిచారం : ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
హైదరాబాద్ : నగరంలో వ్యభిచార ముఠాల గుట్టు రట్టు చేస్తున్నారు పోలీసులు. తాజాగా చైతన్యపురిలోని ప్రభాతనగర్ కాలనీలో గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తోన్న వ్యభిచార గృహంపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో పలువురు యువుతులు, నిర్వాహకుడితో పాటు ఓ విటుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా, పశ్చిమబెంగాల్ కు చెందిన పి.బిశ్వాస్ ప్రభాత నగర్ కాలనీలో జనావాసాల మధ్యే ఎవరికీ అనుమానం రాకుండా వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. అయితే దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడు బిశ్వాస్ తో పాటు కొంతమంది యువతులను, ఖైరతాబాద్ కు చెందిన విటుడు కృష్ణ కబీర్ ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం యువతులను రెస్క్యూ హోమ్ కు తరలించారు. ఇక ఇందులో ప్రధాన సూత్రధారులుగా ఉన్న బాలానగర్ వాసి పింటు, రాజ్ మండల్ అలియాస్ రసూల్ కోసం ప్రస్తుతం పోలీసులు వేట కొనసాగుతోంది.