పదేళ్ల సభ: వరవరరావు, నేతల అరెస్ట్(పిక్చర్స్)
హైదరాబాద్: మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సదస్సును పోలీసులు భగ్నం చేశారు. సదస్సుకు హాజరావుతారనే ఉద్దేశంతో శనివారం అర్ధరాత్రి నుంచే పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు. వరవరరావుతోపాటు జార్ఖండ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 200మంది కళాకారులను, కార్యకర్తలను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
సభలో పాల్గొనేందుకు వచ్చి కాచిగూడ తుల్జార్ భవన్లో బస చేసిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విరసం నేత కళ్యాణ్రావును గుంటూరు జిల్లాలో అరెస్టు చేశారు. దీంతో ఆదివారం హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు. దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు.
శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించాలనుకున్న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాలను బారీకేడ్లు, ముళ్లకంచెలతో భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ఇలా ఉండగా సభకు హాజరయ్యేందుకు విరసం నేత వరవరరావుతోపాటు మరో 20 మంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు బయలుదేరారు.
అప్పటికే భారీగా మోహరించి ఉన్న పోలీసులు బలగాలు వారిని అడ్డుకున్నాయి. సభకు అనుమతి లేదని వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సభకు అనుమతి లేదు: డిసిపి కమలాసన్రెడ్డి
బందోబస్తు, అరెస్ట్
మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి దశాబ్దం పూర్తయిన నేపథ్యంలో రాజకీయ ప్రత్యామ్నాయ వేదిక ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లో నిర్వహించతలపెట్టిన సదస్సును పోలీసులు భగ్నం చేశారు.
బందోబస్తు, అరెస్ట్
సదస్సుకు హాజరావుతారనే ఉద్దేశంతో శనివారం అర్ధరాత్రి నుంచే పలువురిని ముందస్తుగా అరెస్ట్ చేశారు.
బందోబస్తు, అరెస్ట్
వరవరరావుతోపాటు జార్ఖండ్, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన 200మంది కళాకారులను, కార్యకర్తలను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
బందోబస్తు, అరెస్ట్
సభలో పాల్గొనేందుకు వచ్చి కాచిగూడ తుల్జార్ భవన్లో బస చేసిన జార్ఖండ్ రాష్ట్ర ప్రజా గాయకుడు జీత్ మరాండీ, పినాకపాణి, పద్మకుమారి, వరలక్ష్మితోపాటు మరికొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బందోబస్తు, అరెస్ట్
వీరితోపాటు ప్రొఫెసర్ హరగోపాల్ను కూడా అదుపులోకి తీసుకున్నారు. విరసం నేత కళ్యాణ్రావును గుంటూరు జిల్లాలో అరెస్టు చేశారు.
బందోబస్తు, అరెస్ట్
దీంతో ఆదివారం హైదరాబాద్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సభకు అటు పోలీసు శాఖ అనుమతించలేదు.
బందోబస్తు, అరెస్ట్
దీంతో వరవరరావు హైకోర్టును ఆశ్రయించగా సభ నిర్వహణకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించింది. అయినప్పటికీ సభ నిర్వహించి తీరుతామని సభ నిర్వాహకులు, విరసం నేతలు ప్రకటించారు.
బందోబస్తు, అరెస్ట్
శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్రెడ్డి ఆధ్వర్యంలో సభ నిర్వహించాలనుకున్న బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద భారీగా బలగాలు మోహరించారు.
బందోబస్తు, అరెస్ట్
సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి వెళ్లే అన్ని మార్గాలను బారీకేడ్లు, ముళ్లకంచెలతో భద్రతా ఏర్పాట్లు చేశారు.
బందోబస్తు, అరెస్ట్
ఇది ఇలా ఉండగా సభకు హాజరయ్యేందుకు విరసం నేత వరవరరావుతోపాటు మరో 20 మంది సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్దకు బయలుదేరారు.
బందోబస్తు, అరెస్ట్
అప్పటికే భారీగా మోహరించి ఉన్న పోలీసులు బలగాలు వారిని అడ్డుకున్నాయి. సభకు అనుమతి లేదని వారిని అరెస్ట్ చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.
బందోబస్తు, అరెస్ట్
అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, సభ నిర్వాహకులకు మధ్య వాగ్వివాదం జరిగింది. ఆందోళనకారులు ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
బందోబస్తు, అరెస్ట్
విరసం నేత వరవరరావు నిర్వహించాలని భావించిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్రెడ్డి స్పష్టం చేశారు. సభకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు.
బందోబస్తు, అరెస్ట్
నిషేధిత మావోయిస్టు పార్టీకి, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అనుబంధ సంఘమన్న పక్కా సమాచారంతోనే సభ నిర్వహణకు అనుమతించలేదని చెప్పారు.
బందోబస్తు, అరెస్ట్
ఇలాంటి నిషేధిత సంఘాల తరపున ప్రచారం చేసినా నేరమేనని, అందువల్ల ఇప్పటికే ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన పలువురుని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.
బందోబస్తు, అరెస్ట్
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయడాన్ని పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఖండించాయి.
బందోబస్తు, అరెస్ట్
విరసం నేత వరవరరావు తదితరుల అరెస్ట్లను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఖండించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.
విరసం నేత వరవరరావు నిర్వహించాలని భావించిన ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభకు అనుమతి లేదని సెంట్రల్ జోన్ డిసిపి విబి కమలాసన్రెడ్డి స్పష్టం చేశారు. సభకు హైకోర్టు కూడా అనుమతి నిరాకరించిందని ఆయన గుర్తు చేశారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి, ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక అనుబంధ సంఘమన్న పక్కా సమాచారంతోనే సభ నిర్వహణకు అనుమతించలేదని చెప్పారు. ఇలాంటి నిషేధిత సంఘాల తరపున ప్రచారం చేసినా నేరమేనని, అందువల్ల ఇప్పటికే ఇతర రాష్ట్రాలు, ప్రాంతాల నుంచి వచ్చిన పలువురుని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు.
ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభకు హాజరయ్యేందుకు వచ్చిన వారిని అరెస్ట్ చేయడాన్ని పౌర హక్కుల సంఘాలు, ప్రజా సంఘాలు ఖండించాయి. విరసం నేత వరవరరావు తదితరుల అరెస్ట్లను సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఖండించారు. ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాయి.