న్యూ ఇయర్ సందర్భంగా జోరుగా డ్రగ్స్ విక్రయాలు.. రూ.10 లక్షల విలువ గల మత్తు స్వాధీనం
మరికొన్ని గంటల్లో 2020 ముగియబోతోంది. 2021కి యావత్ ప్రపంచం స్వాగతం చెబుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా యువత జోష్లో ఉండటం సహజమే.. మందేసి చిందేస్తారు. దీనిని కొందరు ఆసరాగా తీసుకుంటున్నారు. వారికి డ్రగ్స్ అందజేసి.. సొమ్ము చేసుకోవాలని అనుకుంటున్నారు. వాస్తవానికి డ్రగ్స్ విక్రయాలు రోజూ జరుగుతున్న.. డిసెంబర్ 31వ తేదీ అయినందున ఇవాళ మరింత ఎక్కువగా విక్రయాలు జరుగుతాయి. దీనిని వారు క్యాష్ చేసుకోవాలని అనుకోగా.. డ్రగ్స్ పోలీసులు సీజ్ చేశారు.
న్యూ ఇయర్ వేడుకలు టార్గెట్ చేసుకొని డ్రగ్స్ విక్రయించే ప్రయత్నించారు. వారిని వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్ పరిధిలో 10 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎండీఎల్ఏ, ఎల్ఎస్డీ డ్రగ్స్తోపాటు హాసిష్ ఆయిల్, గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ ముంబై నుంచి తీసుకొచ్చి హైదరాబాద్లో విక్రయిస్తున్నట్టు గుర్తించారు.
అయితే ముంబైలో తక్కువ ధరకు కొనుగోలు చేస్తారని తెలుస్తోంది. హైదరాబాద్లో రెట్టింపు ధరలకు విక్రయించబోతోంది. ముఠాకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారిని తుకారాం గేట్ పోలీసులకు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అప్పగించారు.
న్యూ ఇయర్ సందర్భంగా మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం మత్తులో యువత జోగుతోంది. సందట్లో సండేమియా అన్నట్టు.. డ్రగ్స్ కూడా జోరుగా విక్రయాలు చేస్తున్నారు.