జుబ్లీహిల్స్లో అర్ధరాత్రి తుపాకీ కలకలం, కేసు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి పూట తుపాకి కలకలం చెలరేగింది. ఓ వ్యక్తి వద్ద ఆరు తూటాలతో కూడిన రివాల్వర్ను జూబ్లీహిల్స్ చెక్ పోస్టు వద్ద శుక్రవారం రాత్రి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
సినీ దర్శకులు అమ్మ రాజశేఖర్ మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నట్లు తేలడంతో అతని పైన కేసు నమోదు చేశారు. కాసేపటికే బెంజి కారు అటు వైపుగా వచ్చింది. డ్రైవర్ కోటేశ్వర రావును తనిఖీలు చేయకు అతను మద్యం తాగినట్లు గుర్తించి, కేసు నమోదు చేశారు.
అదే కారులో ఉన్న వ్యక్తి కిందకు దిగారు. అతని దగ్గర రివార్వల్ ఉంది. దానిని చూసిన పోలీసులు ప్రశ్నించారు. తాను కాంగ్రెస్ నేత గూడులు నారాయణ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిని అని తెలిపారు. రివాల్వర్ గూడురు నారాయణ రెడ్డి పేరు మీద ఉందని చెప్పారు.
ఆయన పెళ్లికి వెళ్లడంతో దానిని తన దగ్గర ఉంచారన్నారు. లైసెన్స్దారు లేకుండా రివాల్వర్ మరో వ్యక్తి వద్ద ఉండటంతో పోలీసులు వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలం చేరుకొని తుపాకీని, ఆరు రౌండ్ల బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.