రూ 8 కోట్ల నగదు పట్టివేత
మరో రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే హైద్రబాద్ లో భారి ఎత్తున నగదును స్వాధీనం చేసుకున్నారు హైద్రబాద్ పోలీసులు, సోమవారం సాయంత్రం హైద్రాబాద్ ,నారాయణగూడ ప్లైఓవర్ దగ్గర కారులో తరలిస్తున్న రూ.8 కోట్ల నగదును సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా ఈ డబ్బు ఎవరిది అనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా బ్యాంకు నుండి డ్రా చేసి తీసుకువస్తున్నాని సదరు వ్యక్తి పోలీసులకు చెప్పినట్టు సమాచారం ,అయితే ఆ డబ్బు ఓ జాతియ పార్టీకి చెందిన రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించిన డబ్బుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ డబ్బు పార్టీ అవసరాల కోసం తీసుకువస్తున్నట్టుగా ఆ పార్టీ నాయకులు చెబుతున్నట్టుగా సమాచారం, కాగా ఇంతపెద్ద మొత్తంలో డబ్బు పట్టుబడడంతో పలు అనుమానాలకు తెరలేస్తుంది .కాగా రేపటితో ప్రచారం ముగియనుండడంతో ఓటర్ల ను ప్రలోభపెట్టేందుకు ఇప్పటినుండే పార్టీలు పావులు కదుపుతుండడంతో హైద్రబాద్ పోలీసులు సైతం పకడ్బంది చర్యలు చేపట్టారు. అడుగడుగునా తనిఖీలు చేపట్టారు.