వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పాత నగదు నోట్లను మార్చుకొనేందుకు వచ్చి పోలీసులకు చిక్కాడు

కుషాయిగూడలోని లక్ష్మారెడ్డి ఇంట్లో నవంబర్ 11వ, తేదిన జరిగిన భారీ దొంగతనానికి సంబందించిన దొంగను పోలీసులు పట్టుకొన్నారు. లక్ష్మారెడ్డి ఇంట్లో 11 లక్షల నగదు, బంగారాన్ని మహేష్ అనే దొంగ డోచుకొన్నాడు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ :పెళ్ళి జరగాల్సిన ఇంట్లో ఇంటి పెద్ద మరణించి విషాదం అలుముకొంది. ఇంటి పెద్ద అంత్యక్రియల్లో ఉండగానే , పెళ్ళి కోసం తెచ్చిన నగదు, నగలను దొంగించాడు పాత నేరస్థుడు. అతి చాకచక్యంగా పోలీసులు పాతనేరస్థుడిని పట్టుకొన్నారు. రద్దు చేసిన నగదు నోట్లే దొంగను పట్టించాయి.

కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి లక్ష్మారెడ్డి ఈ నెల 16వ, తేదిన మరణించాడు. అదే రోజు మధ్యాహ్నం ఆయన కూతురు నిశ్చితార్థం జరగాల్సి ఉంది. ఈ నిశ్చితార్థం కోసం 11 లక్షల నగదు, 20 తులాల బంగారాన్ని ఇంట్లో తెచ్చి పెట్టారు.

హఠాత్తుగా లక్ష్మారెడ్డి మరణించడంతో కుటుంబసభ్యులు భోకసముద్రంలో మునిగిపోయారు.లక్ష్మారెడ్డి అంత్యక్రియులకు కుటుంబసభ్యులు, బంధువులు వెళ్ళగా పేట్ బషీరాబాద్ కు చెందిన పాత నేరస్థుడు కాలే మహేష్ ఈ ఇంట్లోకి దూరి నగదును, నగలను దోచుకొన్నాడు.నగదును, నగలను ఎత్తుకెళ్ళే సమయంలో తాను డ్రైవర్ నని నమ్మించాడు.

police traceout kushiaguda robbery accuse

బంగారం, నగదుతో పాటు సెల్ ఫోన్ ను కూడ ఎత్తుకొని పోయాడు. ఈ సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు కేసును విచారించారు.అయితే ఈ ఫోన్ ను వాడుతున్న వ్యక్తి నిజామాబాద్ జిల్లాలో ఉన్నట్టు గుర్తించారు. అయితే తనకు ఈ ఫోన్ బస్సులో దొరికిందని ఆ వ్యక్తి చెప్పాడుదీంతో కేసు మళ్ళీ మొదటికి వచ్చింది.ఏం చేయాలనే దానిపై పోలీసులు కసరత్తు ప్రారంభించారు.

రద్దైన నోట్లు పట్టించాయి.

లక్ష్మారెడ్డి ఇంట్లో దోచుకొన్న నగదు అంతా రద్దు చేసిన నగదే. ఈ నగదును మార్చుకోవడం మహేష్ కు కష్టంగా మారింది.పాత నగదును మార్చుకొంటూ పోలీసులకు చిక్కాడు. జీడిమెట్ల పోస్టాఫీసులో 80 వేల రూపాయాల నగదును మార్చుకొన్నాడు మహేష్..రెండోరోజు కూడ మరో 80 వేల రూపాయాలను మార్చుకొనేందుకు పోస్టాఫీసుకు వచ్చాడు. అనుమానం వచ్చిన పోస్టాపీసు సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరపడంతో అసలు విషయం వెలుగు చూసింది.

English summary
police trace out kushaiguda robbery incedent .mahesh thief he is theft laxma reddy house at kushaiguda. around 11 lakhs currncy, and ornaments on nov 16, 2016, this currency old currency. so mahesh exchange the currency, mahesh exchange 80 thousand currency jeedimetla post office. second day he try to exchange another 80 thousand, post office employees informed to the police. mahesh accept the kushaiguda robbery.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X