భూకంపం: ఎక్స్పీరియన్స్ చెప్పిన కాంగ్రెస్ నేత
హైదరాబాద్: ఆంజనేయ స్వామి దయతో తాను భూకంపం నుండి బయటపడ్డానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. ఢిల్లీ భూకంపం జోన్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఉత్తర భారతాన్ని భూకంపం వణికించిన విషయం తెలిసిందే.
ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో భూప్రకంపనలు వచ్చాయి. ప్రస్తుతం పొంగులేటి సుధాకర్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. దీంతో, ఆయన పైవిధంగా స్పందించారు.
కాగా, ఆంధ్రప్రదేశ్లోనూ మంగళవారం మధ్యాహ్నం భూ ప్రకంపనలు సంభవించాయి. చాలా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు వచ్చిన విషయం తెలిసిందే. కృష్ణా, గుంటూరు, విశాఖ, కాకినాడ, రాజమండ్రి, భీమవరం, శ్రీకాకుళం జల్లాల్లో ప్రకంపనలు సంభవించాయి.
కాకినాడలోని రామారావు ప్రాంతంలో కొన్ని ఆపార్ట్మెంట్లలో 4, 5 అంతస్థులో ఉన్నటువంటి కొంతమంది దీనిని గుర్తించారు. ఇంట్లో వస్తువు ఊగినట్లు అనిపించింది. ఈ నేపథ్యంలో ఉత్తర భారతంలో భూ ప్రకంపనలు వచ్చినట్లు వార్తలు రావడంతో కాకినాడలోని అపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ప్రజలు భయంతో రోడ్లమీదకు వచ్చారు.
విజయవాడ, కృష్ణా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో కొద్ది సెకన్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. కృష్టా, గుంటూరు జల్లాల్లోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి. ముఖ్యంగా విజయవాడ, కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి.