రూ.1,66,182: పేద కుటుంబానికి కరెంట్ బిల్లు వాత, మూడు బల్బులు, ఫ్యాన్కే మోత, కట్టాల్సిందే...?
లాక్డౌన్ సమయంలో కరెంట్ బిల్లుకి సంబంధించి మీటర్ రీడింట్ తీయలేదు కాబట్టి కొందరికీ లక్షలకు లక్షల బిల్లు వచ్చింది. లాక్ డౌన్ ముగిసి.. విద్యుత్ సిబ్బంది ఇంటింటికీ తిరిగి బిల్లు తీస్తున్నారు. తర్వాత తప్పులు జరగొద్దు. కానీ ఓ పేద కుటుంబానికి లక్ష యాభై వేల పైచిలుకు బిల్లు వచ్చింది. దానిని చూసి ఇంటి యజమాని నోరెళ్లబెట్టాడు.
జోగులాంబ గద్వాల జిల్లా కొండపల్లి గ్రామానికి చెందిని తెలుగు శివ రాముడుకి పేద కుటుంబం. 3 బల్బులు, ఫ్యాన్, టీవీ ఉంది. అయితే ఇతనికి గతంలో కరెంట్ బిల్లు వంద, రూ.150 మించేది కాదు. లాక్ డౌన్ సమయంలో కూడా సరిగ్గానే వచ్చింది. కానీ జూలై నెలలో మాత్రం బిల్లు చూసి శివ షాకయ్యారు. రూ.లక్ష 66 వేల 182 వచ్చింది. అయితే అది పొరపాటుగా వచ్చి ఉంటుందని భావించాడు.
Recommended Video
విద్యుత్ అధికారులను కలిసి తన సమస్యను వివరించారు. వారు బిల్లు చూసి కట్టాల్సిందేనని చెప్పారట. దీంతో శివ ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నాడు. తన బిల్లును ఎలాగైనా సవరించాలని కోరుతున్నారు. తన ఇల్లు, జాగా అమ్మిన ఆ బిల్లు మొత్తం కట్టలేనని వాపోతున్నారు. తన సమస్యను పరిష్కరించాలని అధికారులను వేడుకుంటున్నారు.