మంచి విషయం: ప్రభాస్, గోపీచంద్ ఉచిత ప్రచారం(పిక్చర్స్)
హైదరాబాద్: వైద్యరంగంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. ఎన్నో రకాల దీర్ఘ కాలిక వ్యాధులకు సైతం చికిత్సలు హైదరాబాద్ నగరంలో లభిస్తున్నాయి. ఈ తరుణంలో ప్యూర్ హెల్త్ సర్వీసెస్ అందిస్తున్న 'వెల్ కేర్' హెల్త్ కార్డును ప్రముఖ నటుడు ప్రభాస్ ఆదివారం రాత్రి మాదాపూర్లోని వెస్టర్న్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ప్యూర్ హెల్త్ లైఫ్ హెల్త్ సర్వీసెస్ సంస్థ వెల్ కేర్ హెల్త్ కార్డు పేరుతో ఓ సర్వీస్ ప్రారంభిస్తోంది. ఈ సర్వీస్తో కేవలం 999 రూపాయలకే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పేదలకు ఇది వరంలా ఉపయోగపడుతుంది.
కార్డు ఆవిష్కరణ
ఈ హెల్త్ కార్డు సర్వీస్కు హీరో గోపీచంద్ ఉచితంగా ప్రచారం చేయనున్నాడు. ఇదే బాటలో బాహుబలి ప్రభాస్ కూడా ఈ కార్యక్రమాన్ని ఉచితంగా లాంఛ్ చేసేందుకు ఒప్పుకున్నాడు.
ప్రభాస్, గోపీచంద్, శ్రీకాంత్
సాధారణంగా సినీ తారలు యాడ్లలో నటించాలంటూ రూ. లక్షలు, కోట్లలో చెల్లించాల్సిందే.. అయితే ప్రభాస్, గోపీచంద్ మాత్రం సేవ చేయాలనే ఉద్దేశంతో ఉచిత ప్రచారానికి అంగీకరించారు.
ప్రభాస్, గోపీచంద్, శ్రీకాంత్
ప్యూర్ హెల్త్ లైఫ్ హెల్త్ సర్వీసెస్ అనే సంస్థ.. వెల్ కేర్ హెల్త్ కార్డ్ పేరుతో ఓ సర్వీస్ ప్రారంభిస్తోంది. ఈ కార్డుతో రూ. 999కే కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకునే అవకాశం లభిస్తుంది.
ప్రభాస్, గోపీచంద్, శ్రీకాంత్
ముఖ్యంగా ఇన్స్యూరెన్స్ లాంటి విషయాలపై పెద్దగా అవగాహన లేని పేదలకు ఇది వరం లాంటిదనే చెప్పవచ్చు.
ప్రభాస్ గోపీచంద్
అందుకే ఈ కాన్సెప్ట్ బాగా నచ్చేయడంతో గోపీచంద్.. ఒక్క రూపాయి తీసుకోకుండా దీనికి ప్రచారం చేసేందుకు అంగీకరించారట.
మాట్లాడుతున్న శ్రీకాంత్
హెల్త్ కాన్సెప్ట్ తోపాటు గోపీచంద్ విషయం తెలిసిన ప్రభాస్.. ఈ కార్యక్రమాన్ని ఉచితంగా ప్రారంభించేందుకు అంగీకరించారు.
గోపీచంద్
పేదలకు సాయం చేసే కార్యక్రమానికి ఇద్దరు అగ్ర హీరోలు ఉచితంగా ప్రచారం చేయడం అభినందించదగ్గ విషయమే.
ప్రభాస్
ప్రస్తుతం బాహుబలి-2 సినిమా షూటింగ్లో ప్రభాస్ బిజీగా ఉండగా, ఆక్సిజన్ సినిమా పనిలో గోపీచంద్ర కూడా బిజీగానే ఉన్నారు. విరామ సమయాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం మంచి విషయమే.