హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స‌వ‌తి త‌ల్లి ఇంటి అద్దెను ప్ర‌త్యూష‌కే అందించండి: హైకోర్టు

|
Google Oneindia TeluguNews

హైద‌రాబాద్‌: స‌వ‌తి త‌ల్లి చేతిలో చిత్ర‌హింస‌ల‌కు గురైన ప్ర‌త్యూష కేసులో హైకోర్టు సోమవారం విచారించింది. తన సవతి తల్లి ఇంటిపై వస్తున్న అద్దెను ప్రత్యూషకే అందేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది.

ప్ర‌త్యూష స‌వ‌తి త‌ల్లి ఉంటోన్న ఇల్లు కిరాయి డ‌బ్బులు ఎంత వ‌స్తున్నాయో తెలుసుకుని కోర్టుకు చెప్పాల‌ని ఆదేశించారు. ఆ డ‌బ్బును ప్ర‌త్యూష ఖాతాలో జ‌మ‌చేయాల‌ని పేర్కొన్నారు. త‌దుప‌రి కేసు విచార‌ణ‌ను రెండు వారాలకు వాయిదా వేశారు.

కాగా, ప్ర‌త్యూష చిత్ర హింస‌ల‌కు సంబంధించి మీడియాలో వ‌చ్చిన వార్త‌ల‌కు స్పందించిన ముఖ్యమంత్రి కెసిఆర్ దంప‌తులు ఆమెను క‌లిసి భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే.

Prathyusha case trial in High Court

ప్ర‌త్యూష ఎప్పుడు అవ‌స‌ర‌మైన త‌న ఇంటికి వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని, ఆందోళ‌న చెందొద్ద‌ని కూడా సీఎం దంప‌తులు ఆమెకు తెలిపారు. సిఎం కెసిఆర్ ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లిన ప్రత్యూష అక్కడే భోజనం చేసిన విషయం తెలిసిందే.

ఇటుక బ‌ట్టీ కార్మికుల సంక్షేమంపై ప్ర‌శ్నించిన హైకోర్టు

ఇటుక బ‌ట్టీలో ప‌నిచేస్తోన్న‌ కార్మికుల దుర్బ‌ర‌స్థితిపై దాఖ‌లైన పిటిష‌న్‌పై సోమవారం హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ఇటుక బ‌ట్టీ కార్మికుల సంక్షేమం కోసం రెండు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై ప్ర‌శ్నించింది. రెండు వారాల్లోగా కోర్టుకు నివేదిక అంద‌జేయాల‌ని ఇరు రాష్ట్రాల ప్ర‌భుత్వాల‌ను కోర్టు ఆదేశించింది.

English summary
High Court on Monday conducted a trial in case of Prathyusha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X