2018 తెలంగాణ బడ్జెట్: సంక్షేమానికి ప్రాధాన్యత
Recommended Video
హైదరాబాద్:బడ్జెట్ కేటాయింపుల్లో సంక్షేమ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. మహిళా, శిశువుల సంక్షేమం కోసం రూ.1799 కోట్లను కేటాయించింది. తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ గురువారం నాడు బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
ఎంబీసీ సంక్షేమం కోసం వెయ్యి కోట్లను కేటాయించారు. రజక ఫెడరేషన్ కోసం బడ్జెట్లో రూ. 200 కోట్లు కేటాయించారు. మైనార్టీ శాఖకు రూ. 2 వేల కోట్లు, గర్భిణీల సంక్షేమం కోసం రూ. 561 కోట్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
నాయీబ్రహ్మణ ఫెడరేషన్కు రూ. 250 కోట్లను బడ్జెట్లో కేటాయించింది తెలంగాణ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నిర్మాణం కోసం రూ.2643 కోట్లను బడ్జెట్లో కేటాయించింది. షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలకు రూ. . 1450 కోట్లు బడ్జెట్ లో కేటాయించారు
జర్నలిస్టుల సంక్షేమం కోసం బడ్టెట్లో రూ. 75 కోట్లు కేటాయించారు. ఎస్సీల సంక్షేమం కోసం రూ. 12,709 కోట్లు, ఎష్టీల సంక్షేమం కోసం రూ.8063 కోట్లను కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
బీసీల సంక్షేమం కోసం రూ.5920 కోట్లు కేటాయించింది. దళితులకు మూడెకరాలను భూ పంపిణీకి సుమారు రూ.1469 కోట్లను కేటాయించింది. నాయీ బ్రహ్మణ ఫెడరేషన్కు రూ. 250 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ముస్లిం అనాధ పిల్లలకు ఆశ్రయం ఇచ్చే కుల్ గుర్బా భవన్ నిర్మాణం కోసం రూ. 20 కోట్లను బడ్జెట్లో కేటాయించింది సర్కార్.