వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆఖరిఘడియల్లో శ్వాసపీల్చే జంతువులా జీవిస్తున్నా: భార్యకు రాసిన లేఖలో సాయిబాబా ఆవేదన

90 శాతం వైకల్యంతో ఉన్న డా. జి.ఎన్. సాయిబాబాను పోలీసులు అరెస్ట్ చేసి నాగ్‌పూర్ అండాసెల్ జైలులో బంధించారు. అక్కడ అనుభవిస్తున్న బాధల గురించి భర్య వసంతకు రాసిన లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు సాయిబాబా.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన జీవిత కాలంలో అత్యధిక విలువైన సమయాన్నితెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించేందుకే కేటాయించారాయన. దేశంలో ఆదివాసులు, దళితులు, ముస్లింలు, మహిళలు, రైతాంగం, కార్మికులు, విద్యార్థులు, మొత్తం పీడిత వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా వారి తరుపున పోరాటం చేశారు.

ఆయనే.. ప్రొఫెసర్ సాయిబాబా. కానీ ఆయన మావోయిస్టు పార్టీ సభ్యుడంది ప్రభుత్వం, మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ అర్బన్ కనెక్ట్‌గా చిత్రీకరిస్తూ కుట్రపూరితంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

prof-gn-saibaba

90 శాతం వైకల్యంతో ఉన్న డా. జి.ఎన్. సాయిబాబాను రాజకీయ విశ్వాసాల కారణంగా పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి నాగ్‌పూర్ అండాసెల్ జైలులో బంధించారు. అక్కడ అనుభవిస్తున్న బాధల గురించి భర్య వసంతకు రాసిన లేఖలో గోడు వెళ్లబోసుకున్నారు సాయిబాబా.

రాబోయే చలికాలాన్ని తలచుకుంటేనే భయం వేస్తోందని.. ఇప్పటికే జ్వరంతో వణికిపోతున్నానని భార్య వసంతకు రాసిన లేఖలో సాయిబాబా తాను అనుభవిస్తున్న బాధను వెల్లడించారు. నవంబర్ నుంచి మొదలయ్యే చలికాలంలో బతికి ఉండడం తనకు అసాధ్యమని సాయిబాబా తన ఆవేదనను వ్యక్తం చేశారు.

తాను ఆఖరిఘడియల్లో శ్వాస పీల్చే జంతువులా జీవిస్తున్నానంటూ తన దుర్భర జీవితాన్ని ఆ లేఖలో సాయిబాబా స్పష్టంగా చెప్పారు. సీనియర్ న్యాయవాదిని ఖరారు చేసి అక్టోబర్ లేదా నవంబర్ నెలలో తన బెయిల్ పిటిషన్ దాఖలు చేయమని గాడ్లింగ్‌కి తెలపాలంటూ పేర్కొన్నారు. వీలైనంత త్వరలో ఇది జరగాలని, లేకుంటే పరిస్థితి చేయి దాటిపోతుందని సాయిబాబా తన భార్య వసంతకు రాసిన లేఖలో స్పష్టం చేశారు.

ఒక నిర్భాగ్యుడిలా, బిక్షగాడిలా పదే పదే ప్రాధేయడాల్సి రావడం తనను కుంగదీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీమతి రెబికా, నందిత నారాయణ్‌, ప్రొఫెసర్ హరగోపాల్‌ తదితరులతో మాట్లాడి మొత్తం పరిస్థితిని వారికి చెప్పాలని సాయిబాబా ఆ లేఖలో తన భార్యను కోరారు.

English summary
Wheel chair bound Prof. GN Saibaba, who was sentenced to life imprisonment by Maharashtra Court for alleged links to Maoists and for “waging war” against India, has written a letter to his wife A S Vasantha Kumari on the occasion of her birthday.Saibaba, who is languishing in Yarwada jail in Pune, after the court found him guilty of abetting Maoist activities and incarcerated him for life imprisonment under various sections of Unlawful Activities Prevention Act (UAPA), asks her in the letter to not stop dreaming about an egalitarian and democratic society.The letter, which was posted by Vasantha Kumari herself on her Facebook account, asks her to take a resolve to ‘face this adversity, this brutality inflicted on them, and violence perpetrated on them’.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X