వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కలకలం రేపుతున్న బంగారం పుకార్లు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

జనగామ :జనగామ జిల్లాలోని కొందరికి గుప్త నిదులు లభ్యమయ్యాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది.ఆ నోటా ఈ నోట ఈ ప్రచారం కాస్త పోలీస్ స్టేషన్ వరకు చేరింది. కాని, బంగారం దొరకలేదని పోలీసులు చెబుతున్నారు.

జనగామ జిల్లాలోని నర్మెట మండలం అమ్మాపురం గ్రామంలో కొందరికి గుప్త నిధులు దొరికాయనే ప్రచారం సాగుతోంది.ఈ గ్రామంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఈ విషయమై చర్చ సాగుతోంది. అయితే గుప్త నిధులు దొరికినట్టు సాగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని పోలీసులు చెబుతున్నారు.

publicity of gold sensation in jagoan district

అమ్మాపురం గ్రామానికి చెందిన ఓ ఇంట్లో నిధులు దొరికాయని కొందరు, మసీదు వద్ద దొరికాయని మరికొందరు చెబుతున్నారు.ఈ గ్రామంలో కాకుండా జిల్లాలోనే వేరే ప్రాంతాల్లో నిధులు లభ్యమయ్యాయనే ప్రచారం కూడ సాగింది.ఈ విషయం పై పోలీసులకు సమాచారం అందింది.

గ్రామానికి చెందిన అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.గ్రామానికి చెందిన ఓ వ్యవసాయ బావి వద్ద వెతికితే రెండు బాక్సలు దొరికాయి. అందులో ఏమీలేవు. ఒక గ్లాసు దొరికింది. గ్రామస్థుల ముందే వాటిని పోలీసులు తెరిచారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించారు. అసలు నిజంగా బంగారం దొరికిందా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

English summary
wide publicity about gold recevied some people in agriculture field in janagoan district.narmeta mandal wide spread this news. poice enquired about this gold issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X