వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓటుకు నోటు- నాతో టిడిపి నేతలు మాట్లాడలేదు: బాబుపై రాజయ్య ఆగ్రహం

ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తన పేరు ప్రచారంలోకి రావడంపై తెరాస నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య గురువారం నాడు స్పందించారు. కుట్రపూరిత రాజకీయాలకు చంద్రబాబు కేరాఫ్ అడ్రస్ అని భగ్గుమన్నారు.

ఓటుకు నోటులో సంచలనాలు: అప్పుడే స్కెచ్, ఎర్రబెల్లి పాత్ర, స్టీఫెన్ ఓకే?ఓటుకు నోటులో సంచలనాలు: అప్పుడే స్కెచ్, ఎర్రబెల్లి పాత్ర, స్టీఫెన్ ఓకే?

ఇరు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తాను చేసిన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి కేసుల్లో తనలాంటి వాళ్లను బలి చేయడం చంద్రబాబుకు సమంజసం కాదన్నారు.

Rajaiah says TDP leaders did not met him

అదే విధంగా ఓటుకు నోటు విషయంలో తనను ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కలువలేదని చెప్పారు. చివరి దాకా తాను తెలంగాణ రాజన్నలాగే రాజకీయాలలో కొనసాగుతానని చెప్పారు.

కాగా, ఓటుకు నోటు కేసులో రాజయ్యను కూడా ట్రాప్‌లోకి దించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వచ్చాయి. రాజయ్యను కూడా ట్రాప్‌లో పడేయాలనుకున్నారు. మహానాడు బయలుదేరేముందు చంద్రబాబు ఇంట్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజయ్యను ట్రాప్ చేసినట్లు సండ్ర.. సెబాస్టియన్‌కు చెప్పినట్లుగా వార్తలు రావడంపై స్పందించారు.

English summary
Former Telangana Deputy Chief Minister Rajaiah on Thursday said that he did not met any Telugudesam Party leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X