వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్రేకింగ్ కోసమే మీడియా ప్రయత్నం, అందుకే సీఎంలు ప్రెస్‌మీట్లకు సిద్ధంగా లేరు: రాజ్‌దీప్ సర్దేశాయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ క్లప్ 53వ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజ్‌దీప్ సర్దేశాయ్ 'ఇండియా ఇన్ బ్రేకింగ్ న్యూస్ ఎరా' అనే అంశంపై మాట్లాడారు. హైదరాబాదు ఎంతో మంది గొప్ప జర్నలిస్టులను అందించిందని చెప్పారు. మీడియాను అడ్వర్టయిజ్‌మెంట్ విభాగాలే శాసిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రులు ఎవరు కూడా ప్రెస్ మీట్ పెట్టడానికి ఆసక్తి చూపించడం లేదన్నారు.

Rajdeep Sardesai Says Fake News Increasing With Social Media

జర్నలిస్టులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు వారు సిద్ధంగా లేరన్నారు. ఈ రోజుల్లో మీడియా సంచలనాల కోసమే ప్రయత్నాలు చేస్తోందన్నారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫేక్ న్యూస్‌లు చాలా పెరిగాయన్నారు. ప్రజలకు అవసరమైన విద్య, వైద్యం, వ్యవసాయంపై అవసరమైన మేర స్పందించడం లేదన్నారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను కూడా ప్రారంభించారు. దీనికి కూడా ఆయన చీఫ్ గెస్టుగా ఉన్నారు.

English summary
3 June 2018 Press Club somajiguda organised Telangana formation day week chief guest Mr rajdeep sardesai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X