సీఎం కేసీఆర్ కు ఐదు రాఖీలే - కరోనా నేపథ్యంలో నిరాడంబరంగా
రాష్ట్రంలో కరోనా విజృంభణ, అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు వైరస్ బారిన పడుతోన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయమైన ప్రగతి భవన్ లో సోమవారం రాఖీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్కు ఐదుగురు సొంత సోదరీమణులు మాత్రమే రాఖీ కట్టారు. రక్షా బంధన్ కట్టి, స్వీట్లు తినిపించుకున్న తర్వాత సోదరీమణులు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, జయమ్మ, లక్ష్మీబాయిల నుంచి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. మహిళా మంత్రులు, ఇతర నేతలెవరూ సీఎంను కలవలేకపోయాయి. అయితే..
ఈ ఏడాది ప్రగతి భవన్ రాఖీ వేడుకలో మంత్రి కేటీఆర్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. మహిళా మంత్రులు, టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఈసారి కేటీఆర్ లోనే కేసీఆర్ ను చూసుకున్నారు. ఉదయం సొంత సోదరి కవితతో రాఖీ కట్టించుకున్న కేసీఆర్.. మిగతా సమయాన్నంతా పార్టీ నేతల కోసమే కేటాయించారు. కేసీఆర్ కు ఆయన అక్కలు రాకీ కట్టిన సమయంలోనే మనుమడు(కేటీఆర్ కొడుకు) హిమాన్ష్కు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది.
కరోనా షాకింగ్: దేశంలో రెండో దశ ఉత్పాతం - అంచనా వేయలేమన్న ఐసీఎంఆర్ - భిన్నంగా వైరస్ తీరు..
అంతకుముందు, రాక్షా బంధన్ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీక అన్నారు. రాష్ట్రంలో మహిళల భద్రత, గౌరవం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తుందని సీఎం పునరుద్ఘాటించారు.
పండుగ పూట జగన్ సర్కారుకు శవయాత్ర - బీజేపీ వెన్నుపోటు, పవన్ నాయకత్వం - పద్మశ్రీ సంచలనం
Recommended Video
కరోనా నియంత్రణ, కరోనా నేపథ్యంలో విద్యారంగంలో తీసుకోవాల్సిన చర్యలు, నియంత్రిత సాగు పద్ధతిలో వ్యవసాయం, సెక్రటేరియట్ నూతన భవన సముదాయ నిర్మాణం తదితర అంశాలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ ఈనెల 5న సమావేశం కానుంది. ప్రగతి భవన్ లోనే ఈ సమావేశం జరుగనుంది.
రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి రాఖీ కట్టిన సోదరీమణులు.#RakshaBandhan pic.twitter.com/mM1G1jAgff
— TRS Party (@trspartyonline) August 3, 2020