కరోనా విషయంలో ఢిల్లీ కంటే హైదరాబాద్ సేఫ్ అంటున్న రకుల్ ప్రీత్ సింగ్
దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ కరోనా హాట్ స్పాట్ గా మారిందని ఆందోళన వ్యక్తమవుతోంది.ఇదే సమయంలో హైదరాబాద్ కరోనా బారిన పడకుండా కాపాడుకోవడానికి సేఫ్ జోన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్.
కరోనా లక్షణాలున్న రిమాండ్ ఖైదీ పరారీ .. టెన్షన్ లో స్థానికులు ..పోలీసుల గాలింపు
రకుల్ ప్రీత్ సింగ్ కరోనా వైరస్ వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టిన లాక్ డౌన్ లో భాగంగా ఢిల్లీలో ఉంటున్నారు. అక్కడ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న తీరు , అదేవిధంగా అక్కడి కాలుష్యం కూడా పెరుగుతున్న తీరుతో ఆందోళన చెందిన రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇక హైదరాబాద్లోనే తను ఉండాలని నిర్ణయం తీసుకున్న రకుల్ ప్రీత్ ఢిల్లీ తో పోల్చి చూస్తే హైదరాబాద్ చాలా బెస్ట్ అంటూ వ్యాఖ్యానించారు. తన సోదరుడితో కలిసి హైదరాబాద్లో నివసించేందుకు నిర్ణయం తీసుకున్న రకుల్ ప్రీత్ సింగ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇంటికి సమీపంలో తన సొంత ఇంట్లో ఉంటున్నారు.
ఇప్పటివరకు ఢిల్లీలో 1,18, 645 కేసు నమోదు కాగా, తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా చూస్తే 41,018 కేసులు నమోదయ్యాయి. ఏది ఏమైనా ఢిల్లీ తో పోల్చి చూస్తే హైదరాబాద్ బెస్ట్, హైదరాబాద్ కరోనా నుండి కాపాడుకోవడానికి సేఫ్ జోన్ అని రకుల్ ప్రీత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆసక్తికరంగా మారాయి.