క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ను కలిసి రామ్ చరణ్ తేజ సంతోషం
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి కపిల్ దేవ్తో కలసి టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ గురువారం నాడు వేదిక పంచుకున్నాడు. హైదరాబాదులో జరిగిన ఖుషి చారిటబుల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు.
అనంతరం రామ్ చరణ్ తేజ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కపిల్ దేవ్తో వేదిక పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అంతేకాదు, కపిల్ దేవ్తో కలసి దిగిన ఫొటోను కూడా అప్లోడ్ చేశాడు.
గురువారం హైదరాబాద్లో ఖుషి అనే స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో కపిల్ దేవ్తో కలిసి పాల్గొన్న చెర్రీ... ఖుషి ఫౌండేషన్కు తన పూర్తి సహకారం అందిస్తానని చెప్పాడు.
అందరూ అహింస మార్గంలో నడవాలి: రాజేంద్రప్రసాద్
ప్రజలందరూ హింసను విడనాడి అహింస మార్గంలో నడవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ పిలుపునిచ్చారు. చర్లపల్లి కేంద్ర కారాగారంలో నిర్వహించిన గాంధీ జయంతి వేడుకలల్లో ఆయన పాల్గొన్నారు. ఆటపాటల పోటీల్లో విజేతలైన ఖైదీలకు రాజేంద్రప్రసాద్, శివాజీ రాజా, వేణుమాధవ్లు బహుమతులు అందించారు.