'ఎంఎస్ ధోనీ'లో ఆ పాత్రలో రామ్ చరణ్ తేజ, అందుకే సస్పెన్స్!
హైదరాబాద్: భారత క్రికెట్ జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవిత కథ ఆధారంగా ఎంఎస్ ధోనీ చిత్రం వస్తోంది. ఈ నెల 30వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ విషయమై ఓ ఆసక్తికర విషయం వెలుగు చూసింది. ఈ సినిమాలో టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ కూడా కనిపించనున్నారని వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ తేజ ఈ సినిమాలో సురేష్ రైనా పాత్రలో కనిపిస్తారని తెలుస్తోంది. అంతేకాదు, పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్.. విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది.
కాగా, ఈ సినిమా సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కథానాయకుడిగా నటించారు. భూమిక చావ్లా, కైరా అడ్వానీ, దిశా పఠానీ ప్రధాన పాత్రలు పోషించారు.
హిందీ, తెలుగు, తమిళ్, మరాఠీ భాషల్లో విడుదల చేస్తున్న ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో, టీజర్, ట్రైలర్లో రామ్ చరణ్ కనిపించలేదు. అయితే.. అభిమానులకు సర్ ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారని సమాచారం.