ఆఫీస్ దగ్ధం: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు రామోజీ రావు ఫోన్
ఈనాడు అధిపతి రామోజీ రావు ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు ఫోన్ చేసి పార్టీ కార్యాలయంలో చెలరేగిన అగ్నిప్రమాదం గురించి అడిగి తెలుసుకున్నారు.
హైదరాబదా్: 'ఆంధ్రజ్యోతి' ప్రధాన కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదంపై 'ఈనాడు' సంస్థల అధిపతి రామోజీరావు విచారం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన ఎబిఎన్ 'ఆంధ్రజ్యోతి' మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణకు ఫోన్ చేసి మాట్లాడారు.
ప్రమాద వివరాలను జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. అగ్ని ప్రమాదం నేపథ్యంలో పత్రిక నిర్వహణకు సంబంధించి ఎలాంటి సహకారం అవసరమైనా అందిస్తామని రామోజీరావు చెప్పారు. ఇటీవల హైదరాబాదులోని ఆంధ్రజ్యోతి కార్యాలయం మంటల్లో కాలిపోయిన విషయం తెలిసిందే.
తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు ఆంధ్రజ్యోతి కార్యాలయాన్ని సందర్శించి రాధాకృష్ణను పలకరిస్తున్నారు.
Comments
ramoji rao eenadu vemuri radhakrishna abn andhrajyothy hyderabad telangana రామోజీ రావు ఈనాడు వేమూరి రాధాకృష్ణ ఎబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ తెలంగాణ
English summary
Eeandu Ramoji Rao called ABN Andhrajyothy MD vemuri Radhakrishna and enquired about the fire accident occured in Hyderabad office.
Story first published: Thursday, May 4, 2017, 10:49 [IST]