శుభలేఖ ఇచ్చేందుకు వచ్చి వివాహితపై అత్యాచారయత్నం, పెళ్ళి జరిగేనా?
పెళ్ళి కార్డు ఇచ్చేందుకు వచ్చి ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించిన ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో చోటుచేసుకొంది. ఈ ఘటనతో వివాహిత కాపురంలో కలతలు రేగాయి.
హైదరాబాద్: పెళ్ళి కార్డు ఇచ్చేందుకు వెళ్ళిన ఓ ప్రబుద్దుడు ఓ వివాహితపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధితురాలు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు.అయితే నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే ఈ ఘటనతో వివాహిత కాపురంలో చిచ్చురేగింది. మరో వైపు నిందితుడి పెళ్ళి పై నీలినీడలు కమ్ముకొన్నాయి.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి గత ఏడాది అదే మండలానికి చెందిన యువకుడితో వివాహమైంది. పూర్వాశ్రమంలో ఆమె స్వగ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే స్నేహితుడికి ఇటీవల పెళ్ళి కుదిరింది.
తన పెళ్ళి శుభలేఖ ఇచ్చేందుకు శ్రీనివాస్ శనివారం సాయంత్రం వివాహిత ఇంటికి వెళ్ళాడు. అత్తగారింట్లో ఆమె ఒంటరిగా ఉంది. అయితే ఈ అవకాశాన్ని తీసుకొన్న శ్రీనివాస్ వివాహితపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.
ఆమె కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. శంషాబాద్ గ్రామీణ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అనుహ్యాంగా చోటుచేసుకొన్న ఈ ఘటనతో వివాహిత కుటుంబంలో కలతలు రేగాయి. ఈ ఘటనతో నిందితుడిపై నిర్భయ కేసు నమోదైంది. వివాహం జరుగుతోందా లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.