KTR: ట్విట్టర్లో వీడియో పోస్ట్ చేసిన కేటీఆర్.. చూస్తే ఆగమే ఇగ..!
భాగ్యనగరం విశ్వనగరంగా మారుతోంది. మన హైదరాబాద్ తెలుగు ప్రజల గుండెకాయగా మారింది. ఈ మహా నగరం ఎంతో మందిన అక్కున చేర్చుకుని ఉపాధి కల్పిస్తుంది. భాగ్యనగరం పెట్టుబడిదారులకు స్వర్గధామంగా మారుతోంది. తాజాగా హైదరాబాద్ సంబంధించి సందర్శినీయ ప్రదేశాలు, నగర అభివృద్ధికి సంబంధించిన వీడియో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ పోస్ట్ చేశాడు.
ఈ వీడియో హైదరాబాద్ లో ఉన్న సందర్శనీయ ప్రదేశాలు, అభివృద్ధికి సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి. ఈ వీడియోలో గండిపేట పార్క్, బన్సీలాల్ పేట మెట్ల బావి, టీ హబ్, పోలీస్ కమెండ్ కంట్రోల్ సెంటర్, షైక్ పేట ఫ్లైఓవర్, ముక్తి ఘాట్, ట్యాంక్ బండ్, కొత్తగా నిర్మిస్తున్న సెక్రేటెరియట్, ఫార్మూల ఈ రేస్ స్ట్రీట్, మల్కం చెరువు, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్వే స్టేషన్, మెజాంజాహి మార్కెట్, చార్మినార్, మైండ్ స్పేస్ జంక్షన్, కుత్ బ్ షాహీ పార్కు ఉన్నాయి.
కాగా ఈ మధ్యే హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టడానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు మైక్రోసాఫ్ట్, అమెజాన్ ముందుకు వచ్చాయి. మైక్రోసాఫ్ట్ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. హైదరాబాద్లో మరో 3 డాటా సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. తెలంగాణలో వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమెజాన్ ముందుకొచ్చింది.
#HamaraHyderabad#ProudHyderabadi #Hyderabad ❤️ pic.twitter.com/y93wginL30
— KTR (@KTRTRS) January 23, 2023