టీఎస్పీఎస్సీకి హైకోర్టులో ఊరట: టీఆర్టీ నోటిఫికేషన్పై పిటిషన్ కొట్టివేత
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు
హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు హైకోర్టులో ఊరట లభించింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్టీ) నోటిఫికేషన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. దీంతో పాత జిల్లల ప్రాతిపదికన నోటిఫికేషన్లు జారీ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన వారికి చుక్కెదురైనట్లైంది.
కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడంతో తమకు నష్టం జరుగుతుందంటూ కొందరు దాఖలు చేసిన పిటిషన్లపై గురువారం న్యాయస్థానం విచారణ జరిపింది. అయితే, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకునే తాము నోటిఫికేషన్ ఇచ్చామని టీఎస్ పీఎస్పీ వివరించింది. దీంతో ఏకీభవించిన కోర్టు ఈ పిటిషన్లను కొట్టివేసింది.
అక్టోబర్ 21న రాష్ట్రంలోని 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్ పీఎస్సీ ఐదు నోటిఫికేషన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష తేదీలను ప్రకటించనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.