మేమేంటో చూపిస్తాం, అంతొద్దు.. రాజకీయాల్లో చేరండి: రేణుక హెచ్చరిక
ఖమ్మం: పోలీసులకు ఉత్సాహం ఉంటే రాజకీయాల్లో చేరాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేముకా చౌదరి సూచించారు. తమ పార్టీ కార్యకర్తల పైన తప్పుడు కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాము ఏమిటో చూపిస్తామని చెప్పారు.
అధికార పార్టీ పైన, తెలంగాణ పోలీసుల పైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ తమ కార్యకర్తలను వేధిస్తున్నారని ఆరోపించారు.
అంతగా ప్రాధాన్యం లేని ప్రాంతాలను జిల్లా కేంద్రాలుగా ప్రకటిస్తున్న నేపథ్యంలో ఎంతో ప్రాధాన్యం ఉన్న భద్రాచలం నియోజకవర్గాన్ని జిల్లాగా ఎందుకు ప్రకటించకూడదని, భద్రాద్రిని జిల్లాగా ప్రకటించాలని, భద్రాద్రి ఏజెన్సీ వాసులు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అన్నారు.
ప్రజలు ఎలా చెప్తే అలా చేస్తామని చెప్పే సీఎం కేసీఆర్ భద్రాచలం వాసుల కోరికను ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదని ప్రశ్నించారు. భద్రచాలం నియోజకవర్గాన్ని జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గురువారం నుంచి తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు ఎమ్మెల్యే సున్నం రాజయ్య ప్రకటించారు.