ఆ ఛానల్ బెదిరింపు: నటి సునీత వీడియోని పోస్ట్ చేసిన 'జనసేన' వింగ్ శతఘ్ని మిసైల్
Recommended Video
హైదరాబాద్: మహేష్ కత్తి తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సునీత ఓ ఛానల్లో జరిగిన చర్చలో చెప్పారు. అదే సమయంలో మహేష్ కత్తి కూడా ఆమెపై తాను పరువు నష్టం దావా వేయబోతున్నట్లు ప్రకటించారు.
మరోవైపు తనను ఓ చానల్ బెదిరిస్తున్నారంటూ సునీత మరో వీడియోను పోస్ట్ చేశారు. దీనిని జనసేన పార్టీ సోషల్ మీడియా వింగ్గా భావించే శతఘ్ని మిసైల్ తన ట్విట్టర్ అకౌంటులో పోస్ట్ చేసింది.
Requesting @cpcybd @cyberabadpolice @hydcitypolice @TelanganaDGP
— Shatagni Missile ✍ (@TeluguChegu) April 15, 2018
Minister @KTRTRS
editors guild @AshokAkaybee @ShekharGupta @sheela2010
Ministry @MIB_India @PIB_India @smritiirani
2 come 2 rescue of upcoming actor complaining that @TV9Telugu is threatening her right to speech pic.twitter.com/ekG2cfRkgJ
సైబరాబాద్ సీపీ, సైబరాబాద్ పోలీస్, హైదరాబాద్ సిటీ పోలీస్, తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీ రామారావు, ఎడిటర్స్ గిల్డ్, కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి ఈ వీడియోను పోస్ట్ చేశారు.
అప్ కమింగ్ నటి మాట్లాడే హక్కును ఆ తెలుగు ఛానల్ కాలరాస్తోందని, దాని నుంచి ఆమెను కాపాడాలని కోరింది. తనకు పేరెంట్స్ సపోర్ట్ లేదని, తాను ఆ ఛానల్కు వస్తానని చెప్పలేదని, వారే పిలిచారని, ఉన్నది ఉన్నట్లు చెప్పానని, లేనిది చెప్పలేదని, క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడమంటే తాను ఉన్నదే చెప్పానని, మహేష్ కత్తికి ఆ ఛానల్ ఇంత మద్దతు ఇస్తుందని తనకు నిజంగా తెలియదని, వాళ్లు తనను ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వాపోయారు.