నాటకాలు కట్టిపెట్టు: కేటీఆర్కు రేవంత్ రెడ్డి ఘాటు కౌంటర్
హైదరాబాద్: సేవ్ నల్లమల అంటూ సామాన్యులతోపాటు ప్రముఖులు కూడా ఉద్యమంగా ముందుకు రావడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ అంశంపై స్పందించారు. నల్లమలలో యురేనియం తవ్వకాల వ్యవహారంలో ప్రజల ఆవేదనను పరిగణలోకి తీసుకుంటామని అన్నారు.
అంతేగాక, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ట్విట్టర్ వేదికగా స్పందించారు. కాగా, సినీ ప్రముఖులతోపాటు ప్రతిపక్షాలు కూడా యురేనియం తవ్వకాలపై పోరాటానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
I hear all of your concern on the issue of uranium mining in Nallamala forest. Assure you all that i shall personally discuss the matter with Hon’ble CM KCR Garu
— KTR (@KTRTRS) September 13, 2019
Recommended Video
ఇప్పటికే సీనియర్ కాంగ్రెస్ నేత వీ హనుమంతరావు నేతృత్వంలో టీపీసీసీ పోరాట కమిటీని ఏర్పాటు చేసింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో యురేనియం తవ్వకాలపై పోరాటం చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఇటీవల వీహెచ్తో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించారు.
రేవంత్ కౌంటర్
నల్లమల యురేనియం తవ్వకాల వ్యవహారంలో మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్పై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. 'కేటీఆర్ గారూ.. సురభి నాటకాలు కట్టిపెట్టి యురేనియం తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను రద్దు చేయండి' అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు.