వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరికీ తెలియకుండానా? ఉత్తమ్‌కు నోటీసులు ఇవ్వాల్సిందే: రేవంత్ రెడ్డి డిమాండ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మరోసారి విభేదాలు తెరపైకి వచ్చాయి. హూజుర్‌నగర్ ఉప ఎన్నికకు అభ్యర్థిగా పద్మావతి పేరును టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వ్యతిరేకించారు.

ఈ విషయమై బుధవారం గోల్కొండ హోటల్‌లో కుంతియాతో రేవంత్ భేటీ అయ్యారు. అధిష్టానానికి సమాచారం లేకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏకపక్షంగా అభ్యర్థిని ఎలా నిర్ణయిస్తారని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియాను రేవంత్ ఈ సందర్బంగా నిలదీశారు.

 revanth reddy fires at Uttam Kumar Reddy for Huzurnagar ticket issue

అంతేగాక, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నోటీసులు జారీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళతానని అన్నారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో హూజుర్ నగర్ నుంచి గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో హూజుర్ నగర్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు జరగాల్సి ఉంది. కాగా, ఈ నియోజకవర్గం నుంచే సీఎం కేసీఆర్ కూతురు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత కూడా టీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

English summary
Congress leader revanth reddy fired at TPCC president Uttam Kumar Reddy for Huzurnagar ticket issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X