వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మావి రాజకీయ లెక్కలు, అందుకే మేమంతా ఉద్యమంలో పాల్గొన్నాం: రేవంత్ షాకింగ్

మా రాజకీయ నాయకులు వారి వారి పార్టీల ఉనికి, మనుగడ, విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, లెక్కలు వేసుకొని పాలుపంచుకున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మా రాజకీయ నాయకులు వారి వారి పార్టీల ఉనికి, మనుగడ, విస్తృత రాజకీయ ప్రయోజనాల కోసమే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, లెక్కలు వేసుకొని పాలుపంచుకున్నారని టిడిపి నేత రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అందరూ లెక్కలేసుకున్నారు

అందరూ లెక్కలేసుకున్నారు

ఆయన మంగళవారం నాడు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయా పార్టీల జెండాలు మోసిన నాయకులు లెక్కలు వేసుకునే రాజకీయ లబ్ధి కోసం ఉద్యమించారని రేవంత్ వ్యాఖ్యానించారు.

త్యాగాలు చేసింది వారు

త్యాగాలు చేసింది వారు

ఇక, మా విషయాన్ని (రాజకీయ నాయకులను) పక్కన పెడితే త్యాగాలు చేసిన వారు ఎందరో ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు. అమరవీరుల కుటుంబాలు, విద్యార్థులు వంటి వారు ఏమీ ఆశించకుండా ఉద్యమించారని చెప్పారు. వారి త్యాగాలను వృథా కానివ్వవద్దని కేసీఆర్‌కు సూచించారు.

విఫల ప్రయోగం కావొద్దు

విఫల ప్రయోగం కావొద్దు

ఎవరి త్యాగాల పునాదులపైన రాష్ట్రం వచ్చిందో తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణ విఫల ప్రయోగంగా ఉండవద్దన్నారు. మన శత్రువులు, మనలను గేలి చేసిన వారి ముందు పలుచన కావొద్దన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేసీఆర్ తప్పారన్నారు.

అలా చేయవద్దు

అలా చేయవద్దు

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే అమరవీరుల స్థూపం నిర్మిస్తామన్నారు. కేసీఆర్ ఆ హామీని ఇచ్చి మరిచారని మండిపడ్డారు. నవ్విన వారి ముందు కేసీఆర్ జారిపడ్డట్లుగా చేయవద్దన్నారు.

English summary
Telangana Telugudesam Party leader Revanth Reddy hot comments on poltical leaders in Telangana agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X