నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేసీఆర్ సీఎంగా అవసరమా? కవిత మాట నిలబెట్టుకోలేదు: రేవంత్ విమర్శలు

|
Google Oneindia TeluguNews

నిజామాబాద్: టీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి విమర్శల తీవ్రతను పెంచారు. గురురవారం నిజామాబాద్‌లో కాంగ్రెస్ నేత అరికెల నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

<strong>అచ్చు 'యన్టీఆర్'లానే, రాజకీయాల్లేవు: బాలకృష్ణను కలిసిన టీటీడీపీ నేతలు</strong>అచ్చు 'యన్టీఆర్'లానే, రాజకీయాల్లేవు: బాలకృష్ణను కలిసిన టీటీడీపీ నేతలు

కురుక్షేత్రం జరుగబోతోంది..

కురుక్షేత్రం జరుగబోతోంది..

సీఎం కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య కురుక్షేత్రం జరగబోతోందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల్లో ప్రజలను మధ్యపెట్టి.. కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.

Recommended Video

ఓటుకు నోటు కేసులో ఏం పీకుతాడు?
టీఆర్ఎస్‌కు అండగా ఉంటే ఏం చేశారు?

టీఆర్ఎస్‌కు అండగా ఉంటే ఏం చేశారు?

రూ.లక్ష రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచారని, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారని విమర్శించారు. టీఆర్ఎస్‌కు అండగా ఉండే జిల్లాకు కేసీఆర్, ఎంపీ కవిత ఏం చేశారని ప్రశ్నించారు.

కవిత మాట నిలబెట్టుకోలేదు

కవిత మాట నిలబెట్టుకోలేదు

రైతులు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోలేదని రేవంత్ అన్నారు. పసుపు బోర్డు సాధిస్తామని హామీ ఇచ్చిన కవిత మాట నిలబెట్టుకోలేకపోయారని అన్నారు. ప్రగతి భవన్‌లోకి వెళ్లి బాధలు చెప్పుకుందామంటే ప్రజలను అనుమతించడం లేదని అన్నారు.

అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా?

అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా?

అయితే, కాంట్రాక్టర్లు, సినీనటులు, బంధువులను మాత్రమే ప్రగతి భవన్‌లోకి అనుమతిస్తున్నారని రేవంత్ వ్యాఖ్యానించారు. న్యాయం కోసం కోర్టులకు వెళితే ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?, ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా అవసరమా? అని రేవంత్ ప్రశ్నించారు.

English summary
Congress leader Revanth Reddy on Thursday lashed out at Telangana CM K Chandrasekhar Rao and Kalvakuntla Kavitha in Nizamabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X