కృష్ణారెడ్డి మృతి: వెంటనే వచ్చిన లోకేష్, రేవంత్ రెడ్డితో... (పిక్చర్స్)
మహబూబ్ నగర్: తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి (62) సోమవారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు.
కృష్ణారెడ్డి భౌతికాయాన్ని సొంత గ్రామమైన మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి తరలించారు.
మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణారెడ్డి మరణవార్త వినగానే ప్రజాప్రతినిధులు, బంధువులు, అత్మీయులు విచారంలో మునిగితేలారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
కృష్ణారెడ్డి మరణ వార్త విన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సాయంత్రం కొండారెడ్డిపల్లికి విచ్చేసి కృష్ణారెడ్డి భౌతికాయాన్ని సందర్శించారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
నారా లోకేష్ కృష్ణా రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఎమ్మెల్యే రేవంత్ రెడ్డితో కాసేపు మాట్లాడి విచారం వ్యక్తం చేశారు. కుటుంబానికి ధైర్యాన్ని చెప్పారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, మాజీ మంత్రి రాములు, మాజీ ఎమ్మెల్యేలు బక్కని నర్సింహులు, వంశీకృష్ణ, బిజెపి నేత ఆచారితో పాటు మండల నాయకులు, ప్రజాప్రతినిధులు పరామర్శించారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
కృష్ణారెడ్డి కుమారుడు అమెరికాలో ఉండడంతో దహనసంస్కరాలు బుధవారం జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
తెలుగుదేశం పార్టీ యువనేత, కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి (62) సోమవారం ఉదయం ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
కృష్ణారెడ్డి భౌతికాయాన్ని సొంత గ్రామమైన మహబూబ్నగర్ జిల్లా వంగూరు మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామానికి తరలించారు.
కృష్ణారెడ్డికి నారా లోకేష్ నివాళులు
మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కృష్ణారెడ్డి మరణవార్త వినగానే ప్రజాప్రతినిధులు, బంధువులు, అత్మీయులు విచారంలో మునిగితేలారు. కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.