ఒప్పుకుంటే, నా లొల్లి పోతుందని కర్నాటకలో కలిపేసేవారు: కేసీఆర్పై రేవంత్
జిల్లాల విభజన సందర్భంగా తన నియోజకవర్గమైన కొడంగల్ను మూడు ముక్కలు చేశారని, కర్నాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేసేవారేమోనని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
హైదరాబాద్: జిల్లాల విభజన సందర్భంగా తన నియోజకవర్గమైన కొడంగల్ను మూడు ముక్కలు చేశారని, కర్నాటక ఒప్పుకొని ఉంటే తన సొంత మండలాన్ని ఆ రాష్ట్రంలో కలిపేసేవారేమోనని తెలంగాణ టిడిపి నేత రేవంత్ రెడ్డి మంగళవారం నాడు అన్నారు.
కేసీఆర్కు, గుత్తాకు ఝలక్: కాంగ్రెస్ పార్టీలోకి వలస, 'తెరాసకు కౌంట్ డౌన్'
అసెంబ్లీ లాబీల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాల విభజన తర్వాత ఎవరు, ఏ జిల్లాలో ఉన్నారో అర్థం కావడం లేదన్నారు.
మీరు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం, మండలం ఏ జిల్లాలో ఉందని రేవంత్ రెడ్డిని ఓ విలేకరి ప్రశ్నించారు. దానికి రేవంత్ ఆసక్తికరంగా స్పందించారు.
నియోజకవర్గం మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్ జిల్లాల్లో ఉందన్నారు. తనకు సొంత ఇల్లున్న కొడంగల్ను కర్నాటకలో కలిపేవారేమోనని, కర్నాటక ఒప్పుకుంటే నా లొల్లి పోతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అదే పని చేసేవారని ఎద్దేవా చేశారు.
మీరు సిద్ధమా?: నాగ్, మహేష్ బాబు, సానియా, మంచు లక్ష్మీ, సమంతలకు కేటీఆర్
టిడిపి నుంచి తెరాసలో చేరిన వారి గురించి కూడా రేవంత్ స్పందించారు. మొన్నటిదాకా బహిరంగంగా మాట్లాడిన వాళ్లు ఇప్పుడు బల్లలు, చప్పట్లు కొట్టడంలో తెరాస ఎమ్మెల్యేలతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పుడిప్పుడే పశ్చాత్తాప పడుతున్నారని, ఏదో ఓ రోజు ప్లేటు ఫిరాయించినా ఆశ్చర్యం లేదన్నారు.