డ్రగ్ రాకెట్పై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్కు ఝలక్
డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం ప్రశ్నల వర్షం కురిపించారు.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం ప్రశ్నల వర్షం కురిపించారు.
మియాపూర్ భూముల అన్యాక్రాంతాన్ని పక్కదోవ పట్టించేందుకు, పక్కన పెట్టేందుకే డ్రగ్స్ వ్యవహారాన్ని తెరపైకి తీసుకు వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆ కల్చర్ మీరే తెచ్చారట.. పొరపాటున తీసుకున్నానేమో: 13 గం. విచారణ, తరుణ్ తడబాటు
చిన్నా చితక వారి విచారణ.. పెద్దవాళ్ల మాటేమిటి
డ్రగ్స్ కేసులో చిన్నా చితక వారిని తీసుకు వచ్చి విచారణ జరుపుతున్నారని, పెద్ద వాళ్లకు నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదో చెప్పాలని రేవంత్ నిలదీశారు.
Recommended Video
ఆ పబ్బులు తెరాస నేతలవే
హైలైఫ్, టానిక్ పబ్బులు అన్నీ తెరాస నేతలకే చెందినవని రేవంత్ రెడ్డి ఆరోపించారు. గతంలో తాను పబ్బుల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదన్నారు.
కేంద్ర దర్యాఫ్తు సంస్థలకు లేఖలు రాయడం లేదేం
డ్రగ్ వ్యవహారంపై డిఆర్ఐ, నార్కోటిక్ వంటి కేంద్ర దర్యాఫ్తు సంస్థలకు ప్రభుత్వం లేఖలు ఎందుకు రాయడం లేదో చెప్పాలని రేవంత్ అన్నారు.
అప్పగించలరా?
ఇప్పటికైనా డ్రగ్స్ కేసును కేంద్ర దర్యాఫ్తు సంస్థలకు అప్పగించగలరా అని సవాల్ రేవంత్ విసిరారు. ప్రభుత్వం పెద్దల తీరు శవాలపై పేలాలు ఏరుకునేలా తయారయిందన్నారు.