ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు: కేసీఆర్పై రేవంత్కు దొరికిన అస్త్రం
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ సర్కారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు. ఇప్పటికే పలుమార్లు తీవ్ర విమర్శలు చేసిన రేవంత్.. మరోసారి కొత్త అస్త్రంతో కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
కేజ్రీవాల్కు ఎదురుదెబ్బ: 20మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ అనర్హత వేటు
ఈసీకి ఫిర్యాదు చేస్తా..
శనివారం రేవంత్ మీడిమాతో మాట్లాడుతూ.. పార్లమెంటరీ సెక్రటరీలుగా శాసనసభ్యులు ఉండరాదని అన్నారు. ఈ విధంగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆరుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఆ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలాగే ఇక్కడ కూడా
పార్లమెంటరీ సెక్రటరీలుగా వ్యవహరిస్తున్న ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి తాజా డిమాండ్ను తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కేసీఆర్ చేసిందేమిటి?
కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ కూడా కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని కేసీఆర్ తమ ఖాతాలో వేసుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్కారు కొత్తగా చేసిందేం లేదని అన్నారు.
గాంధీభవన్లో చర్చ
గాంధీభవన్లో టీపీసీసీ లీగల్ సెల్ సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్బంగా హైకోర్టు విభజన, న్యాయవాదుల ఇతర సమస్యలపై సమావేశంలో చర్చించారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ కుంతియా, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, నిజామాబాద్ మాజీ పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీగౌడ్తోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.