వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు తృటిలో తప్పిన పెను ప్రమాదం.. మేడారం జాతరకు వెళ్లొస్తుండగా ఘటన!

మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం సాయంత్రం మేడారం సమక్మ-సారలమ్మలను దర్శించుకుని తిరిగి వస్తూ ఆయన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

పస్రా వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. ఆర్టీసీ బస్సును బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం తీవ్రంగా దెబ్బతింది. అయితే ఎమ్మెల్యే శంకర్ నాయక్‌కు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మరో కారులో ఎమ్మెల్యే శంకర్ నాయక్ వెళ్లిపోయారు.

trs-mla-shankar-nayak

ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉంది.

మరోవైపు మేడారం మహా జాతర నాలుగో రోజు ఘనంగా కొనసాగుతోంది. జాతరకు శనివారం ఆఖరిరోజు కావడంతో భక్తులు పోటెత్తారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఆదివాసీ పూజారులు గద్దెల వద్దకు చేరుకుంటారు. పూజల అనంతరం దేవతల వన ప్రవేశంతో జాతర ముగియనుంది.

English summary
TRS MLA Shankar Nayak safely escaped from a road accident. After visiting Medaram Jatara, while returning his car collided with a RTC Bus. The front portion of the Car totally damaged. But nobody injured including MLA Shankar Nayak.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X