భద్రత కోసం నడిచారు: బెలూన్లు ఎగరేసి..(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్రోడ్లో 26వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగ మూడు రంగులున్న బెలూన్లను ఎగురవేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నడిచారు. బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రోడ్డు సేఫ్టీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని, ఇందులో కఠిన నిబంధనలుంటాయని చెప్పారు.
నిబంధనలను అతిక్రమిస్తే లైసెన్సులను రద్దు చేయడం వంటి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. త్వరలో ఆటోలను తగ్గించి టాక్సీలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు. రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువతో రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
సేఫ్టీ వాక్
నగరంలోని నెక్లెస్రోడ్లో 26వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి.
సేఫ్టీ వాక్
పీపుల్స్ ప్లాజా వద్ద ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సేఫ్టీ వాక్
ఈ సందర్భంగ మూడు రంగులున్న బెలూన్లను ఎగురవేశారు. భారీ సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులు ఉత్సాహంగా నినాదాలు చేస్తూ, ప్లకార్డులను ప్రదర్శిస్తూ నడిచారు.
సేఫ్టీ వాక్
బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో రోడ్డు సేఫ్టీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నామని, ఇందులో కఠిన నిబంధనలుంటాయని చెప్పారు.
సేఫ్టీ వాక్
హోంమంత్రి నాయిని మాట్లాడుతూ.. త్వరలో ఆటోలను తగ్గించి టాక్సీలను పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలిపారు.
సేఫ్టీ వాక్
రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యువతో రోడ్డు నిబంధనలపై అవగాహన పెంచితే ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందన్నారు.
సేఫ్టీ వాక్
ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, కమిషనర్ ఎం జగదీశ్వర్, టిఎస్ ఆర్టీసీ ఎండి పూర్ణ చందర్ రావు తదితరులు పాల్గొన్నారు.