'మిస్టర్ ఇండియా'గా హైదరాబాద్ యువకుడు..!
హైదరాబాద్: 'మిస్టర్ ఇండియా' పోటీల్లో హైదరాబాద్ మరోసారి సత్తా చాటింది. ముంబైలో ప్రోవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన పోటీల్లో హైదరాబాద్ వాసి రోహిత్ ఖండేల్వాల్ 'మిస్టర్ ఇండియా-2015' టైటిల్ గెలుచుకున్నాడు.
ముంబైలో అట్టహాసంగా జరిగిన ఈ పోటీలకు దేశం నలుమూలల నుంచి దాదాపు 10 వేల మంది యవకులు హాజరయ్యారు. పలు విభాగాల్లో జరిగిన పోటీల్లో రోహిత్ విజేతగా నిలవగా, బెంగుళూరుకు చెందిన రాహుల్ రాజశేఖరన్ తొలి రన్నరప్గా, ముంబైకి చెందిన ప్రతీక్ గుజ్రాల్ రెండో రన్నరప్గా నిలిచాడు.
ఈ విజయంతో రోహిత్ ఖండేల్వాల్ మిస్టర్ వరల్డ్ పోటీల్లో భారతదేశానికి ప్రాతనిధ్యం వహించనున్నాడు. మిస్టర్ ఇండియాతో పాటు మిస్టర్ యాక్టివ్, ప్రోవోగ్ బెస్ట్ యాక్టర్ టైటిల్ కూడా రోహిత్ సొంతం చేసుకున్నాడు.
ప్రొవోగ్ పర్సనల్ కేర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలీవుడ్ నటి, హీరోయిన్ కరీనా కపూర్ విజేతలకు అభినందనలు తెలిపారు.