పెనుభూతమైన అనుమానం, మరొకరితో చనువుగా ఉంటుందనే, రాంనగర్లో యువతి హత్యపై సీపీ
మరొకరిని ప్రేమిస్తుందనే అనుమానంతోనే హారతిని షాహిద్ మట్టుబెట్టాడని వరంగల్ పోలీసు కమిషనర్ రవీందర్ తెలిపారు. మరొకరితో చనువుగా ఉండటంతో అనుమానం పెంచుకున్నాడని తెలిపారు. అతనిని ప్రేమిస్తూ.. తనకు ఎక్కడ దూరమవుతోందనే భయంతో రగిలిపోయాడని వివరించారు. పక్కా ప్రణాళిక ప్రకారం తన గదికి పిలిపించి హత్య చేశాడన్నారు. హారతి హత్య గురించిన వివరాలను శనివారం సీపీ రవీందర్ మీడియాకు వెల్లడించారు.
అనుమానమే
అనుమానంతో రగిలిపోతున్న షాహిద్.. శుక్రవారం హారతిని తన గదికి రావాలని పిలిచాడు. అతని మదిలో ఇంత పాడు ఆలోచన ఉంటుందని గ్రహించని యువతి నమ్మి వచ్చేసింది. తర్వాత ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారని.. తర్వాత లైంగికదాడి కూడా చేశాడని సీపీ రవీందర్ తెలిపారు. రేప్ చేశాక.. మరో యువకుడి గురించి ఇరువురి మధ్య తీవ్ర వాగ్వివాదానికి దారితీసిందని వెల్లడించారు.
కోపంతో రగిలిపోయి
మాట్లాడుతుండగానే కోపోద్రిక్తుడైన షాహిద్.. తన గదిలో ఉన్న కత్తితో గొంతుకోశాడని సీపీ తెలిపారు. పథకం ప్రకారం రూమ్కు రప్పించి అత్యాచారం చేసి, గొంతుకోసి హతమార్చాడని వివరించారు. నిందితుడు షాహిద్పై 302, 376, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.
మరొకరితో చనువు..
హన్మకొండ రాంనగర్లో నిందితుడు షాహిద్ ఉంటున్నాడు. హారతి-షాహిద్ ప్రేమించుకుంటున్నారు. అయితే ఆమె మరొకరితో చనువుగా ఉండటం, అతనిని ప్రేమిస్తుందనే షాహిద్ మదనపడ్డారు. మాట్లాడుదామని శుక్రవారం పిలిపించాడు. రూమ్కి వచ్చాక షాహిద్, హారతి కాసేపు బాగానే ఉన్నారు. తన మనసులో ఉన్న అనుమాన భూతాన్ని షాహిద్.. బయటకి తీశాడు. వేరేవాళ్లతో చనువుగా ఉంటున్నారనే అంశంపై డిస్కషన్ కూడా జరిగింది. దీంతో ఆవేశానికి గురైన షాహిద్.. తన గదిలో ఉన్న కత్తితో హారతి గొంతుకోశాడు. ఆమె రక్తపుమడుగులు కుప్పకూలిపోయింది. ఆమె చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత బయటకొచ్చాడు.
పీఎస్కు వెళ్లి..
నేరుగా సుబేదారి పోలీసు స్టేషన్కు వెళ్లాడు. తాను యువతిని హతమార్చానని చెప్పడంతో.. పోలీసులు అతని గదికి వచ్చారు. అయితే అతని పక్క గది, చుట్టుపక్కల ఉన్నవారికి కూడా యువతి హత్య గురించి తెలియదు. పోలీసులు రావడంతో ఏం జరిగిందని ఆరాతీశారు. యువతి హత్య జరిగిందని తెలియడంతో జనాలు గుమిగూడారు.