రఫీక కూతురిపై 5 నెలలుగా లైంగికదాడి, గర్భందాల్చిన బాలిక, సంజయ్పై మరో 2 కేసులు..
వరంగల్ గొర్రెకుంటలో సంచలనం సృష్టించిన 9 హత్యల కేసుల్లో విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. కస్టడీలో నిందితుడు సంజయ్ కుమార్ నుంచి కీలక వివరాలను పోలీసులు రాబట్టినట్టు తెలుస్తోంది. నిందితుడు ఆరురోజుల కస్టడీలో ముఖ్యమైన సమాచారం రాబట్టి.. మరో రెండు కేసులను ఫైల్ చేశారు.
ఆ బావిలో 9 శవాలు.. వరంగల్ లో వలస విషాదం ... వలస కార్మిక మరణాల మిస్టరీ ఏంటి ?
ఇదీ విషయం..
నిందితుడు సంజయ్ కుమార్ను పోలీసులు తమదైన శైలిలో విచారించారు. రఫీక కూతురు 14 ఏళ్ల బాలికపై లైంగికదాడి చేసినట్టు అంగీకరించాడు. పలుమార్లు లైంగికదాడి చేసినట్టు తెలుపడంతో.. బాలికకు వైద్య పరీక్షలు చేశారు. వరంగల్లోని ఓ ఇంట్లో ఉన్న బాలికను పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని తెలుస్తోంది. అయితే నిందితుడు బాలికపై గత 5 నెలల నుంచి అత్యాచారం చేసినట్టు సమాచారం. దీంతో హత్య కేసులతో పాటు బాలికపై లైంగికదాడికి సంబంధించి.. అత్యాచారాం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశామని గీసుకొండ సీఐ శివరామయ్య తెలిపారు.
రఫీక నిలదీయడంతో..
కూతురిపై సంజయ్ కుమార్ ప్రవర్తనను చూసి.. రఫీక నిలదీసింది. తీరు మార్చుకోవాలని కోరడంతో.. బెంగాల్ తీసుకెళ్తానని చెప్పి రైల్లో హత్య చేసిన సంగతి తెలిసిందే. అయితే రఫీక గురించి మక్సూద్ భార్య అడగడంతో.. ఇంట్లో బర్త్ డే పార్టీ చేసుకుంటున్న సమయంలో స్లీపింగ్ పీల్స్ కలిపి.. సృహ కోల్పోయాక పాడుబడ్డ బావిలో పడేశాడు. ఈ మొత్తం వ్యవహారం రఫీక కూతురి కోసమే జరిగిందని తెలుస్తోంది. 9 హత్యలతోపాటు మరో రెండు కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
Recommended Video
అదనుచూసి..
మే 20వ తేదీన మక్సూద్ పెద్ద కుమారుడు పుట్టినరోజున సంజయ్ కుమార్ ఘాతుకానికి పాల్పడ్డాడు. వారంతా బర్త్ డే బిజీలో ఉంటే.. ఆహారంలో విషం కలిపాడు. మక్సూద్ ఫ్యామిలీ ఏడుగురు సహా, పై పోర్షన్లో అద్దెకుంటే మరో ఇద్దరు కూడా ఆహారం తిన్న తర్వాత మత్తులోకి జారుకున్నారు. తర్వాత వారందరినీ గోనె సంచిలో వేసి.. బావిలో పడేశాడు. ఆ రోజు రాత్రి 12 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు వారిని బావిలో పడేశాడని... తర్వాత సైకిల్ మీద బయల్దేరిన సంజయ్ సీసీటీవీ ఫుటేజీతో అనుమానం వచ్చి విచారించగా విషయం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.