వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సారిక, పిల్లలు అనుమానాస్పద మృతి: రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు?

By Pratap
|
Google Oneindia TeluguNews

వరంగల్: వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి నేపథ్యంలో మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ మాజీ ఎంపీ సిరిసిల్ల ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. తన అత్తింటి వేధింపులు భరించలేక, ముఖ్యంగా అత్త వేధింపులు భరించలేని స్థితిలో ఉన్నానని కోడలు సారిక ఫిర్యాదుతో గతంలో 498 (ఏ)తో పాటు గృహహింస కేసు నమోదైన విషయం కూడా తెలిసిందే.

Sarika death: Rajaiah's wife Madhavi may be suspended

బుధవారం జరిగిన సంఘటనపై పోలీసులు ఆమె భర్త సిరిసిల్ల రాజయ్య, కొడుకు అనిల్‌తో పాటు ఆమెను అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ నిమిత్తం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.

ఈ నేపథ్యంలో వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మాధవిని విధుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు యూనివర్శిటీ అధికారులు చెపుతున్నారు. అయితే శుక్రవారం వర్సిటీ వీసీ చిరంజీవులు రానున్న నేపథ్యంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.

English summary
Ex MP Siricilla Rajaiah's wife Madhavi may be suspended by the kakatiya university in the wake of sarika and her children death at Warangal in Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X