సారిక, ముగ్గురు పిల్లల సజీవదహనం: రాజయ్య సహా ముగ్గురికి బెయిల్ నిరాకరణ
వరంగల్: కోడలు సారిక, ముగ్గురు మనుమల సజీవదహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య, కుమారుడికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న రెండు వేర్వేరు దరఖాస్తులను సోమవారం రెండో అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది.
రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లల సజీవదహనం కేసులో నిందితులు రాజయ్య, ఆయన భార్య మాదవి, కుమారుడు అనిల్కుమార్, అనిల్కుమార్ రెండో భార్య సనలు ప్రస్తుతం జిల్లా కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే.
ఇప్పటికే రాజయ్య ఆయన భార్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు రెండుసార్లు కొట్టివేసింది కోర్టు.
అనిల్కుమార్ రెండోసారి దాఖలు చేసుకున్న పిటిషన్ను సోమవారం విచారణ అనంతరం న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతోపాటు రాజయ్య దంపతులు మూడోసారి దాఖలు చేసుకున్న పిటిషన్ను కూడా సోమవారం కోర్టు విచారించి.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.