వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెన్నమనేనిపై పిటిషన్: సుప్రీంలో టీడీపీకి షాక్, టీఆర్ఎస్‌లోకి కృష్ణమూర్తి

By Srinivas
|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: వేములవాడ శాసన సభ్యుడు చెన్నమనేని రమేశ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసింది. చెన్నమనేని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేసేందుకు అనర్హుడని పిటిషన్ తెలంగాణ టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి పిటిషన్ వేశారు.

కొద్ది రోజుల క్రితం జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన పిటిషన్ వేశారు. దీనిని ధర్మాసనం కొట్టేసింది. ద్వంద పౌరసత్వం కేసు ఉన్నందున ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెన్నమనేని ఓటు వేయడానికి అనర్హుడంటూ టీడీపీ నేతలు వాధించారు.

SC dismisses Vem petition against Chennamaneni Ramesh

టీఆర్ఎస్‌లోకి బెయినపల్లి కృష్ణమూర్తి

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి బోయినపల్లి కృష్ణమూర్తి తుమ్మల సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేవాడే నాయకుడిగా మిగిలిపోతాడన్నారు. శత్రువుపై ఎల్లప్పుడూ పైచేయిగా ఉండాలన్నారు. అందరూ ఐక్యంగా ఉంటే రాజకీయాల్లో విజయం వరిస్తుందన్నారు. జిల్లాలో ప్రతిపక్షం లేకుండా చేయాలన్నారు.

English summary
SC dismisses Vem petition against Chennamaneni Ramesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X