ఏపీ, తెలంగాణల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో 3, ఆంధ్రప్రదేశ్లో 3 ఎమ్మెల్సీ స్థానాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీల పదవీ కాలం 2019 మార్చి 29తో పూర్తికానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గానికి, తెలంగాణలో.. మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి, మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రంగం సిద్ధం చేస్తోంది.
ఈ
క్రమంలో
ఎన్నికల
కోసం
ఓటర్ల
జాబితా
తయారీకి
ఈసీ
షెడ్యూల్
ప్రకటించింది.
ఓటర్ల
జాబితా
కోసం
అక్టోబరు
1న
ప్రకటన
విడుదల
చేయనుంది.
నవంబరు
6వరకు
ఓటు
హక్కు
కోసం
దరఖాస్తుకు
అవకాశం
కల్పించారు.
2019 జనవరి 1న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల చేయనున్నారు. జనవరి నెలాఖరు వరకు అభ్యంతరాలు, వినతులకు అవకాశం కల్పించారు. 2019 ఫిబ్రవరి 20న ఓటర్ల తుది జాబితా ప్రకటించనున్నారు.