విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు: దేహశుద్ధి చేసిన బంధువులు
హైదరాబాద్: నల్గొండ జిల్లా చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ ఓ విద్యార్ధినిని లైంగిక వేధింపులకు గురి చేశాడు. విద్యార్ధిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్కూల్ ప్రిన్సిపాల్కు బాధితురాలి కుటుంబ సభ్యులు దేహశుద్ధి చేయడంతో పాటు స్కూల్పై దాడి చేశారు. దీనికి సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
గణేష్ అనే వ్యక్తి చౌటుప్పల్లోని ఓ ప్రైవేట్ స్కూల్లో ప్రిన్సిపాల్, కరస్పాండెంట్గా పని చేస్తున్నాడు. కాగా అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని మానసిక వేధింపులకు గురి చేశాడు. సదరు బాలిక తన తల్లిదండ్రులకు బుధవారం ఈ విషయం తెలిపింది.
దీంతో వారు గురువారం ఉదయం పది గంటల ప్రాంతంలో స్కూల్ వద్దకు చేరుకుని గణేష్ను చితకబాది, పోలీసులకు అప్పగించారు. గణేష్తో వాగ్వాదానికి దిగిన సమయంలో అతనికి దేహశుద్ధి చేయటంతోపాటు పాఠశాల ఫర్నిచర్ను ధ్వంసం చేశారు.
విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించిన టీచర్
ఉప్పల్లోని భరత్ నగర్లో ఉన్న ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల టీచర్ ఒకటో తరగతి చదువుతోన్న విద్యార్ధులతో మరుగుదొడ్లను శుభ్రం చేయించారు. ఈ విషయం తెలిసినా విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో విద్యార్ధుల తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్ను నిలదీశారు. టీచర్ చేసిన పనికి ఆందోళన చేశారు.