వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా ప్రభుత్వ సంచలనం ... ఇంటర్ బోర్డు నుండి గ్లోబరీనా తొలగింపు

|
Google Oneindia TeluguNews

తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో అవకతవకల నేపధ్యంలో గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే . ఇక ఈ నేపధ్యంలోనే ఎట్టకేలకు ఇంటర్మీడియట్‌ వార్షిక ఫలితాల ప్రక్రియలో జరిగిన తప్పులతో గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. కొత్త టెండర్లకు బిడ్డర్లను ఆహ్వానించింది.

ఇంటర్ ఫలితాల అవకతవకలకు గ్లోబరీనాదే బాధ్యత అన్న విపక్షాలు

ఇంటర్ ఫలితాల అవకతవకలకు గ్లోబరీనాదే బాధ్యత అన్న విపక్షాలు

ఈ ఏడాది ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలతో తెలంగాణా ప్రభుత్వం చిక్కుల్లో పడింది. కాంగ్రెస్, బీజేపీ లు విద్యార్థులకు మద్దతుగా పోరాటాలు చేశాయి. ఇక ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశాయి. కేసీఆర్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి. ఇక గ్లోబరీనా సంస్థకు కేటీఆర్ కు సంబంధం ఉందని, గ్లోబరీనా సంస్థ డైరెక్టర్ బంధువని చాలా పెద్ద రగడ జరిగింది. ఇంటర్ ఫలితాల అవకతవకలతో అభాసు పాలైన ఇంటర్ బోర్డు, గ్లోబరీనా విషయంలో కూడా ఇబ్బంది ఎదుర్కొంది.ఇక గ్లోబరీనాను టార్గెట్ చేసి రేవంత్ రెడ్డి , వీ హనుమంతరావులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వీహెచ్ అయితే పెద్దమ్మ గుడిలో గ్లోబరీనా తెలీదని ప్రమాణం చెయ్యమని చాలెంజ్ చేశారు. గ్లోబరీనాపై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని పెద్దఎత్తున డిమాండ్ చేశారు.

కొత్త టెండర్లకు పిలుపు

కొత్త టెండర్లకు పిలుపు

అందుకే ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగించకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు సిధ్దమయ్యంది. తెలంగాణ స్టేట్‌ టెక్నలాజికల్‌ సర్వీసెస్‌ (టీఎస్‌టీఎస్‌) ఈ ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా టెండర్లను పిలించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్‌ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచారు. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్‌ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థకి ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. ఇలా గ్లోబరీనాకు చెక్ పెట్టింది ప్రభుత్వం.

కొత్త సంస్థతోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌

కొత్త సంస్థతోనే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌

ఇక త్వరలో జరుగబోయే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్‌ కోసం గ్లోబరీనా పని చేసే అవకాశం లేదు .కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కొత్తగా టెండర్లు పిలించింది. ఈ నెల 25 నుంచి జరిగే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు 3.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధుల ఫలితాలను కొత్త సంస్ధ ప్రాసెస్‌ చేయనుంది.

తెలుగుతల్లి ఫ్లైఓవర్ పై హల్చల్ చేసిన వీ హెచ్ ... కాకా నువ్వు కేకతెలుగుతల్లి ఫ్లైఓవర్ పై హల్చల్ చేసిన వీ హెచ్ ... కాకా నువ్వు కేక

English summary
Sensational decision taken by Telangana government on Globerina because of intermediate row . The government had called for the tenders . Atleast 10 lakhs students data processes should be done by the organization in the early days as well as the organization must not work with the intermediate board in the last two years. Due to this the globerina has lost the chance to work with the intermediate board , the government has removed the services of globerina .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X