మసాజ్ సెంటర్పై పోలీసుల దాడి, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్: హైద్రాబాద్ నగరంలోని మాదాపూర్లోని రైన్ మసాజ్ సెంటర్పై పోలీసులు బుదవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ముగ్గురు యువతులతో పాటు ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.నిందితుల నుండి సుమారు 7 వేల రూపాయాలను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
నగరంలో నిర్వహిస్తున్న కొన్ని మసాజ్ సెంటర్లపై ఎస్వోటీ పోలీసులు దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో మాదాపుర్లోని రైన్ మసాజ్ సెంటర్పై బుధవారం ఎస్వోటీ దాడులు నిర్వహించారు. దాడిలో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్న ముగ్గురు యువతులతో మరో నలుగురిని కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఖచ్చితమైన సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు ఈ మసాజ్ సెంటర్ పై దాడి చేశారు. అయొదే మసాజ్ సెంటర్ నిర్వాహకుడు పారిపోయాడని పోలీసులు తెలిపారు.
నిందితుడిని కూడ పట్టుకొనేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించినట్లు తెలిపారు.