విద్యార్థినులపై మేనమామ లైంగిక వేధింపులు, బాధితులు ఏం చేశారంటే?
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై మేనమామే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులపై మేనమామే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన స్కూల్ సిబ్బంది బాలికలను బాలల హక్కుల సంరక్షణ కేంద్రంలో చేర్పించారు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ జడ్పీ హైస్కూల్ లో చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు గగన్ పహాద్ బాలికల హైస్కూల్ లో పదో తరగతి చదువుతున్నారు. వారి తల్లి లక్ష్మీ పన్నెండేళ్ళ క్రితమే మరణించింది.
తండ్రి ఎక్కడెక్కడో తిరుగుతూ చివరకు కన్పించకుండాపోయాడు. వారిద్దరూ కూడ గగన్ పహాడ్ లోని మేనమామ చంద్రశేఖర్ వద్ద పెరుగుతున్నారు. అయితే మేనమామ చంద్రశేఖర్ ఆ ఇద్దరు విద్యార్థినులను వేదింపులకు గురిచేస్తున్నాడు.
నిద్రిస్తున్నప్పడు చంపేస్తానని బెదిరించడంతో ఈ విషయాన్ని బాలికలు స్కూల్ సిబ్బందికి తెలిపారు. స్కూల్ సిబ్బంది బాలల సంరక్షణ కేంద్రానికి సమాచారమిచ్చారు. ఇద్దరు బాలికలు బాలల సంరక్షణ కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. అయితే ఇంతకాలం పాటు మేనమామ వద్దే పెరిగినందున చంద్రశేఖర్ పై ఫిర్యాదు చేయడం లేదని బాలికలు చెబుతున్నారు.