సత్యం 'రాజు'దంటూ తలసాని సోదరుడి దౌర్జన్యం: షబ్బీర్, హరీష్పై 'ఆశా' ఫైర్
నిజామాబాద్/హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది భూకబ్జాలు, దాడులు చేసేందుకు కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ ఆదివారం అన్నారు. తెలంగాణ సాధించుకుంది మోసపోయేందుకు కాదని, టిఆర్ఎస్ నేతల కబ్జాలకు వ్యతిరేకంగా తమ పార్టీ పోరాడుతుందని చెప్పారు.
బోయినపల్లి ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యుల పైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శంకర్ యాదవ్ దౌర్జన్యం చేసి, భూమి సత్యం రామలింగరాజుదని సొసైటీ సభ్యుల పైన దాడులు చేస్తున్నారని, దీనిని ఖండిస్తున్నామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడుతామన్నారు.
బోయినపల్లిలో ప్రాగ హౌసింగ్ సొసైటీ సభ్యుల పైన దౌర్జన్యానికి తలసాని సోదరుడు పాల్పడటం విడ్డూరమన్నారు. షబ్బీర్ అలీ బోయినపల్లిలో ప్రాగా ఆఫీసర్స్ కో ఆపరేటివ్ సభ్యుల సమావేశంలో మాట్లాడారు.
హరీష్ రావు పైన ఆశా వర్కర్ల ఆగ్రహం
తెలంగాణ రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పైన నిజామాబాద్ జిల్లాలో ఆశా వర్కర్లు మండిపడ్డారు. రెండు రోజుల క్రితం మంత్రి హరీష్ రావు ఆశా వర్కర్ల పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ఆయన
హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ వారు నినాదాలు చేశారు. తమ పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు మరిచి తమ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.