"కెటిఆర్! సమంతనే ఎందుకు, నాగార్జునతో లావాదేవీల వల్లనేనా?"
సమంతను చేనేత బ్రాడ్ అంబాసిడర్గా నియమించడంలోని ఆంతర్యమేమిటని షబ్బీర్ అలీ కెటిఆర్ను ప్రశ్నించారు. నాగార్జునతో ఉన్న లావాదేవీలా వల్లనేనా అని అడిగారు.
హైదరాబాద్: తెలంగాణ మంత్రి కెటి రామారావుపై కాంగ్రెసు నేత షబ్బీర్ అలీ విరుచుకపడ్డారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ సమంతను నియమించడం వెనక మతలబు ఏమిటని ఆయన ప్రశ్నించారు. చేనేత వస్త్రాల ప్రచారానికి తెలంగాణ బిడ్డలు పనికి రారా అని ఆయన ప్రశ్నించారు.
నాగార్జునతో ఉన్న లావాదేవీలతోనే సమంతను చేనే బ్రాండ్ అంబాసిడర్గా నియమించారని ఆయన ఆరోపించారు. కెటిఆర్ రాజకీయాల్లో ఓ బచ్చా అని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. కాంగ్రెసు నేతల వీపులు పగలడం కాదు, వచ్చే ఎన్నికల్లో మిమ్మల్ని చెప్పులతో కొడుతారని ఆయన హెచ్చరించారు.
"కాంగ్రెసు చరిత్ర ఏమిటో మీ నాన్నను అడుగు.. మీ నాన్నకు (కెసిఆర్కు) రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెసు పార్టీ" అని ఆయన అన్నారు. రాష్ట్రంలో వైద్య విధానంపై కూడా ఆయన మాట్లాడారు. తెలంగాణలో వైద్యం పడకేసిందని, తక్షణమే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని షబ్బరీ అలీ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో వైద్య పరిస్థితిపై గవర్నర్ నరసింహన్ దృష్టిసారించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు ప్రజలే బుద్ధి చెప్తారని షబ్బీర్అలీ అన్నారు.